కరోనా బారిన పడిన మంత్రి అవంతి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అవంతి శ్రీనివాస్ తో పాటు ఆయన [more]

Update: 2020-09-15 03:02 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అవంతి శ్రీనివాస్ తో పాటు ఆయన కుమారుడికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసొలేషన్ లనే ఉన్నారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ కార్యాలయానికి తనను కలిసేందుకు రావద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు. అలాగే తనతో వారం రోజులుగా కాంటాక్ట్ అయిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు.

Tags:    

Similar News