మరోసారి సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

రమేష్ ఆసుపత్రి యాజమాన్యం పై తదుపరి చర్యలను నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ [more]

Update: 2020-09-01 13:57 GMT

రమేష్ ఆసుపత్రి యాజమాన్యం పై తదుపరి చర్యలను నిలిపివేయాలన్న హైకోర్టు ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేయనుంది. స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రమేష్ హైకోర్టును ఆశ్రయించడంతో తదుపరి చర్యలకు దిగవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయనుంది.

Tags:    

Similar News