మంత్రివర్గ సమావేశంలో జగన్

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 19వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో పలుకీలక అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించనున్నారు. ప్రధానంగా విశాఖలో పరిపాలన రాజధాని [more]

Update: 2020-08-15 01:54 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 19వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో పలుకీలక అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించనున్నారు. ప్రధానంగా విశాఖలో పరిపాలన రాజధాని శంకుస్థాపన, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రెండు అంశాలు న్యాయపరమైన చిక్కులు ఉండటంతో దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై జగన్ మంత్రి వర్గ సహచరులతో చర్చించనున్నారు. వీటితో పాటు అమరావతి అభివృద్ధిపైనా మంత్రి వర్గ సమావేశం చర్చించనుంది.

Tags:    

Similar News