రహస్య జీవోలు… మంత్రి వర్గ సమావేశంలో…?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈరోజు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. రిజర్వేషన్లను 59.85 శాతం [more]

Update: 2020-03-04 03:16 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈరోజు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. రిజర్వేషన్లను 59.85 శాతం నుంచి తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు దీనిని యాభై శాతం రిజర్వేషన్లు చేస్తూ మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. అయితే మంగళవారం అర్థరాత్రి నాలుగు రహస్య జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. అది పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినవే అయి ఉంటాయని, మంత్రివర్గ సమావేశం కోసమే ఈ జీవోలను ప్రభుత్వం విడుదల చేసిందన్న ప్రచారం ఉంది. మొత్తం మీద నేడు జరిగే మంత్రి వర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భూముల అమ్మకాల విషయంలోనూ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News