దేశ చరిత్రలో ఏ పార్టీకి, ఏ నాయకుడికి లభించని విజయం

జగన్ ఇరవై నెలల పాలనపై ప్రజా తీర్పు ఇదేనని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. పట్టణ ఓటర్లు వైసీపీకే పట్టం కట్టారని చెప్పారు. ఇక తెలుగుదేశం [more]

Update: 2021-03-15 01:05 GMT

జగన్ ఇరవై నెలల పాలనపై ప్రజా తీర్పు ఇదేనని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. పట్టణ ఓటర్లు వైసీపీకే పట్టం కట్టారని చెప్పారు. ఇక తెలుగుదేశం పార్టీ దుకాణం సర్దేయడం బెటర్ అని సలహా ఇచ్చారు. చంద్రబాబు ప్రజలను ఎంత రెచ్చగొట్టినా ప్రజలు తమ దైన రీతిలో తీర్పు చెప్పారని అంబటి రాంబాబు అన్నారు. దేశ చరిత్రలో ఇంతటి విజయం ఏ పార్టీకి, ఏ నాయకుడికి దక్కలేదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ చంద్రబాబు, ఆయన కుమారుడు ఎక్కడున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Tags:    

Similar News