తెలంగాణలో అందరినీ గుర్తించినట్లేనా?

తెలంగాణలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారందరినీ దాదాపుగా గుర్తించారు. 1030 మందిని ఢిల్లీలో జరిగిన మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. వీరందరికీ వైద్య పరీక్షలు [more]

Update: 2020-04-01 14:05 GMT

తెలంగాణలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారందరినీ దాదాపుగా గుర్తించారు. 1030 మందిని ఢిల్లీలో జరిగిన మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో కొంతమందిని ఐసొలేషన్ కు తరలించగా, మరికొందరిని క్వారంటైన్ కు తరలించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రైల్వే శాఖకు కొందరు తప్పుడు అడ్రస్ లు ఇచ్చినా వారిని ఎట్టకేలకు గుర్తించడంతో కొంత మేర ఇబ్బంది తొలిగినట్లయింది. క్వారంటైన్ ఉన్న వాళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Tags:    

Similar News