ఆ లెక్కలకు ఈ లెక్కలకు ఎంత తేడా?

ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవంలో మరణాల లెక్కలకు చాలా తేడా ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా జగన్ [more]

Update: 2021-05-09 00:42 GMT

ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవంలో మరణాల లెక్కలకు చాలా తేడా ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉన్నా ఇంకా నెమ్మదిగానే సాగుతుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. 45 ఏళ్లు దాటిన వారికి కేవలం 28 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తి చేశారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అక్టోబరు లోనే సెకండ్ వేవ్ స్టార్టయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు.

Tags:    

Similar News