బ్రేకింగ్: వైఎస్ జగన్ ప్రచార సభలో భారీ ప్రమాదం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసీపీ ప్రచార సభ జరుగుతోంది. ఈ సభకు [more]

Update: 2019-03-27 11:17 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసీపీ ప్రచార సభ జరుగుతోంది. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీంతో కొందరు సభ జరుగుతున్న కూడలిలో ఉన్న ఒక అంతస్థు భవనంపైకి ఎక్కారు. ఈ భవనం రెయిలింగ్ ఒక్కసారి కూలడంతో సుమారు 50 మంది కింద పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News