తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 148 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు.

Update: 2021-11-16 01:57 GMT

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 148 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,73,722 కరోనా కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 3,975 మంది మరణించారు.

హైదరాబాద్ లోనే...

కొత్తగా నమోదయిన కేసులో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లోనే యాభై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 6,66,012 మంది కోలుకున్నారు. తెలంగాణాలో య ాక్టివ్ కేసులు 3,735 ఉన్నాయి.

Tags:    

Similar News