పోతూపోతూ అనుచరుడికి వెయ్యి కోట్లు ఇచ్చాడే

Update: 2018-06-14 07:38 GMT

మధ్యప్రదేశ్ లోని తాజాగా ఆత్మహత్య చేసుకున్న భయ్యూ మహరాజ్ కి భారీగా ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న భయ్యూ తన ఆస్తులపై సర్వహక్కులూ తనకు నమ్మినబంటుగా ఉన్న వినాయక్ కి దక్కాలని ఆయన రాశారు. దీంతో సుమారు రూ.1000 కోట్ల ఆస్తులు వినాయక్ కి దక్కనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. వినాయర్ గత పదిహేనేళ్లుగా భయ్యూ మహరాజ్ వద్దే అనుచరుడిగా ఉంటున్నాడు. దీంతో ఆయనకే తన ఆస్తులు దక్కాలని భయ్యూ సూసైడ్ నోట్ లో స్పష్టం చేశాడు. అయితే, తమకు ఆస్తి దక్కకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, సుసైడ్ నోట్ పై తమను అనుమానాలు ఉన్నాయని భయ్యూ మహరాజ్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సుసైడ్ నోట్ పైన పూర్తి స్థాయిలో ధర్యాప్తు చేస్తున్నారు. అధికారికంగానే వెయ్యి కోట్ల ఆస్తి ఉంటే, అనధికారికంగా లెక్కల్లోకి రాని ఆస్తులు ఇంకా చాలానే ఉన్నట్లు భావిస్తున్నారు.

Similar News