బాబు కోడలు..వెంకయ్య కుమార్తె కోసమేనా సదస్సు : రోజా

Update: 2017-02-11 17:30 GMT

మహిళా పార్లమెంట్ సమావేశాలు చంద్ర బాబు కోడలు., వెంకయ్య కుమార్తె కోసం నిర్వహిస్తున్నట్లుందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లిన తనను బలవంతంగా హైదరాబాద్ తరలించడంపై రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అండ చూసుకునే విజయవాడలో నేరాలు జరుగుతున్నాయని రోజా ఆరోపించారు. మహిళలపై చంద్రబాబు మాటలు.. చేతలు ప్రతిసందర్భంలో బయటపడుతున్నాయని రోజా మండిపడ్డారు. ఉగ్రవాదినో, హంతకురాలినో అన్నట్లు పోలీసులు తనపై అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాసన సభ్యురాలికే ఏపీలో రక్షణ లేదని రోజా అన్నారు. నారా బ్రాహ్మణి, వెంకయ్య నాయుడు కూతురు కోసం జాతీయ మహిళా పార్లమెంట్ పెట్టారా.. అని రోజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు, స్పీకర్‌కు తనంటే ఎందుకు భయమో తెలియడం లేదన్నారు. రూల్స్ కి విరుద్ధగా తనను సస్పెండ్ చేసిన విషయం ప్రజలు గమనించారని రోజా తెలిపారు. ఇంట్లో కోడలు ఆర్తనాదాలు, ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ పట్ల దురుసు ప్రవర్తన స్పీకర్ గారికి తెలియవా అని ప్రశ్నించారు . తాను రావటం ఇష్టం లేకపోతే తనకు ఆహ్వానం ఎందుకు పంపించారని రోజా ప్రశ్నించారు. మహిళా సమస్యలపై మాట్లాద్దామని మహానాడు లాంటి మీ మీటింగ్ కి బయల్దేరానని రోజా తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మీరు సదస్సు పెట్టారా? లేదా అని రోజా ప్రశ్నించారు.

వంతపాడుతున్న డీజీపీ...

టీడీపీ వాళ్లకు డీజీపీ వంత పాడటం బాధేసిందని ఎమ్మెల్యే రోజా అన్నారు. స్పీకర్ శాసన సభ్యుల హక్కుల కాలరాస్తే ఎవరికీ చెప్పుకోవాలన్నారు. విద్యార్థునులను ప్రొక్లేయినర్ తో సదస్సు నుంచి పంపేశారని రోజా ఆరోపించారు. ప్రెస్‌మెట్‌లో రోజా కన్నీరు ఒక్క గిరిజన మహిళా ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె విమర్శించారు. ఏపీ లో తమకు ప్రాణ హాని ఉన్నదన్నారు. తమ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులని రోజా ప్రశ్నించారు. టీడీపీ కోసం గతంలో ఎంతో కష్టపడితే ఇదా తనకిచ్చిన బహుమానం అని టీడీపీ ప్రభుత్వాన్ని రోజా నిలదీశారు. కులం చూసి టీడీపీలో తనను ఓడించారని రోజా అన్నారు. గర్భిణిగా ఉండి కూడా టీడీపీ కోసం ఎన్నికల ప్రచారం చేశానని రోజా చెప్పారు. ప్రజలు ఇప్పటికైనా నిర్ణయించుకోవాలని.. మహిళా సాధికారిత ఇలాంటి వాళ్ల వల్ల కాదని రోజా విమర్శించారు

Similar News