కన్విన్సింగ్ లీక్ : బాహుబలి-2 కథ ఇదే(నట)!

Update: 2016-10-22 06:23 GMT

బాహుబలి 2 కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా రకరకాల ప్రచారాలు చాన్నాళ్లుగా నడుస్తున్నాయి. ఎవరికి తోచినట్లుగా వాళ్లు, తమ తమ క్రియేటివిటీకి అనుగుణంగా.. కథను వండి వారుస్తూ ఫేస్ బుక్, వాట్సప్ తదితరు సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ లో ప్రచారంలో పెట్టేస్తున్నారు. అలాంటివాటిలో కింద ఇచ్చిన కథ కూడా ఒకటి. కాకపోతే.. ఇందులో రచయిత ఎవరో గానీ.. చాలా కన్విన్సింగ్ గా .. పూర్తి కథను తయారు చేశారు. చాలా చక్కగా లింకులు మిస్ కాకుండా సెకండ్ పార్ట్ కథను నెరేట్ చేశారు. ఏమో బహుశా ఇదే అసలు సెండ్ పార్ట్ కథ కూడా కావచ్చు. ఓ నజర్ వేయండి

☄ పార్ట్ -1 లో క్లైమాక్స్ లో కట్టప్ప అమరేంద్ర బాహుబలి ని వెన్ను పోటు పోడిచానని చెప్పటం తో అక్కడ తో పార్ట్ 1 పూర్తి అవుతుంది. దాని తర్వాత కట్టప్ప మిగిలిన స్టోరీ శివుడు ( ప్రభాస్ ) కి చెబుతాడు. కాలకేయ రాజ్యం మీద గెలిచి విజయ జెండా ఎగరవేసిన మహిస్మతి రాజ్యానికి రాజు గా అమరేంద్ర బాహుబలి అవుతాడు. మరో వైపు 'కన్న కొడుకు (భల్లలా దేవా) కి అన్యాయం జరిగింది' అని బిజ్జల దేవ(నాజర్ ) కోపం తో రగిలి పోతారు.

☄ అమరేంద్ర బాహుబలి పాలన లో మహిస్మతి రాజ్యం అంతా సకల భోగాలతో సంతోషం గా వుంటారు. మహిస్మతి రాజ్యానికి కి దగ్గర లో వున్న కుంతల రాజ్యం మీద చిన్న చిన్న రాజ్యాలు దండెత్తుతుంటాయి. కుంతల రాజ్యాని ఎల్లప్పుడూ కాపాడుకొనే దేవసేన (అనుష్క)ఆ రాజ్యం లో దేవసేన చెప్పిందే చట్టం…శత్రు బలగాలని ఒంటి చేత్తో మట్టి కరిపించే ధైర్య శాలి. ఒక అనుకోని సంఘటన లో దేవసేనని అమరేంద్ర బాహుబలి చూడటంతో అక్కడి నుండి వాళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుంది. మరో వైపు ఆ విషయం తెలుసుకున్న భల్లాలదేవ కూడా అనుష్కని ఇష్టపడతాడు.

☄ ఆ విషయం బిజ్జలదేవ కి తెలుస్తుంది. బిజ్జలదేవ(నాజర్ ) కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు.. ఆ విషయం తెలుసుకున్న దేవసేన నిరాకరిస్తుంది. బిజ్జలదేవ, శివగామితో మన సోంత కొడుకు అయిన భల్లలా దేవా కి రాజు ని చేస్తావని ఆ రోజు అన్నావు…. కానీ మాట తప్పావు.. ఇప్పుడు మన కొడుక్కి ఇష్టమైన ఆ దేవసేన ని కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడు అని తనలో వున్న భాధని శివగామి కి చెబుతాడు.

☄ ఏనిర్ణయం తీసుకోవాలో అర్థం కానీ పరిస్థితి లో శివగామి ఆలోచన లో పడుతుంది. మరో వైపు మహిస్మతి రాజ్యం చేతి లో ఓడిపోయిన కాలకేయ తమ్ముడు నింజా (చరణ్ దీప్) పగతో రగిలిపోతుంటాడు. కుంతలరాజ్యం నుండి విదేయుడు (సుబ్బరాజు ) వర్తమానం మహిస్మతి రాజ్యానికి తీసుకువస్తాడు. బిజ్జలదేవ పంపిన వర్తమానం (కుంతల రాజ్యం) దేవసేన తండ్రి తిరస్కరిస్తునట్టు విదేయుడు చెబుతాడు. ఆ సభలో భల్లాలదేవ కోపం తో విదేయుడు మీద దాడి చెయ్యటానికి దిగుతాడు. ఆ సమయం లో అమరేంద్ర బాహుబలి విదేయుడి (సుబ్బరాజు) కి అడ్డువచ్చి విదేయుడిని కాపాడుతాడు.

☄ బిజ్జలదేవా ఆ సభ లో మళ్ళీ ఆ గొడవని రేపుతాడు. శివగామి అక్కడ జరుగుతున్నదంతా చూస్తూ వుంటుంది. 'ఈ విషయం నా తల్లి శివగామికి వదిలేస్తున్నాను' అని అమరేంద్ర బాహుబలి అంటాడు. సభలో అంతా శివగామి తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. శివగామి రాజ్యం కావాలో, ప్రేమ కావాలో, తేల్చుకోమని ఆ నిర్ణయాన్ని అమరేంద్ర బాహుబలి కి వదిలేస్తుంది.

☄ బాహుబలి చెప్పే సమాధానం కోసం అందరూ ఎదురుచూస్తు వుంటారు. అమరేంద్ర బాహుబలి ప్రేమే... కావాలని కోరుకుంటాడు. బాహుబలి తీసుకున్న నిర్ణయంతో మహిస్మతి ప్రజలలో ఆందోళన మొదలు అవుతుంది. మహిస్మతి ప్రజలు అంతా బాహుబలిని రాజ్యం వదిలి వెళ్ళవద్దు అని వేడుకొంటారు. కానీ బాహుబలి మహిస్మతి ని వదిలి అరణ్య వాసం పడతాడు. ఆ విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలి కి తోడుగా వెళ్తుంది.

☄ బాహుబలి బౌద్ధమఠం లో వుంటూ అక్కడ వున్న వాతావరణం లో దేవసేన ని పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తూ వుంటాడు. మహిస్మతి రాజ్యం అంతా భల్లలదేవా (రానా) ఆధీనం లోకి వెళ్తుంది. ఆ విషయం తెలుసుకున్న కాలకేయ రాజ్యానికి రాజు అయిన నింజా (చరణ్ దీప్) మహిస్మతి రాజ్యం మీద దాడి చెయ్యటానికి సువర్ణ అవకాశం దొరుకుతుంది. మరో వైపు దేవసేన తల్లి అయిందని కుంతల రాజ్యంలో అందరికీ తెలుస్తుంది.

☄ మరో వైపు యుద్ధానికి సిద్ద మవుతారు కాలకేయ సైన్యం. ఆ యుద్ధంలో మహిస్మతి రాజ్యానికి (భల్లాలదేవ) రానా నాయకత్వం వహిస్తాడు. ఆ యుద్ధ భూమి లో మొదటి రెండు దినాలు మహిస్మతి రాజ్యం లో సగం సైన్యం కాలకేయుల చేతిలో నేల కూలతారు. ఇంకో రెండు దినాల్లో మహిస్మతి రాజ్యం కుప్ప కూలుతుంది అని తెలుసుకున్న శివగామి బాహుబలి కి వర్తమానం పంపిస్తుంది.

☄ ఆ విషయం తెలుసుకున్న బాహుబలి తిరిగి తన బార్య తో కలసి మహిస్మతి రాజ్యానికి వస్తాడు. కుంతలరాజ్యం మహిస్మతి రాజ్యానికి సహాయం చేస్తుంది. మరో వైపు బిజ్జలదేవ (నాజర్) బాహుబలి మళ్ళీ తిరిగి వస్తే తన కొడుకు ని రాజ్యం నుండి తప్పిస్తారు అని బిజ్జలదేవ అనుకుంటాడు. ఒక వైపు కాలకేయ చేతిలో ఓడిపోతాం అన్న భయం కంటే, తన అన్న తిరిగి వచ్చాడు అన్న భయం ఎక్కువగా కనిపిస్తుంది.

☄ మహిస్మతి రాజ్యానికి ఎల్లప్పుడూ నమ్మిన బంటు గా పనిచేసే కట్టప్ప (సత్య రాజ్) ని రాజు చెప్పిందే వేదం అనుకుని బాహుబలి ని వెన్నుపోటు పొడవమని భల్లాలదేవ, బిజ్జలదేవ చెబుతారు. కాలకేయ సైన్యం తో యుద్ధం కొనసాగుతుంది. ఆ యుద్ధం లో కాలకేయ సైన్యం అంతా కుప్పకూలుతుంది. యుద్ధం జరుగుతున్న సమయం లో బాహుబలి ని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. ఆ యుద్ధ భూమి లో బాహుబలి చనిపోతాడు.

☄ మహిస్మతి రాజ్యం అంతా ఆ వార్త విని శోకసంద్రం లో వుంటారు. దేవసేన 9 నెలల గర్భవతి అవ్వటం వలన శివగామే దగ్గరుండి చూసు కుంటుంది. రానా బాహుబలి మీద వున్న కోపం తో మహిస్మతి రాజ్యం లో వున్న ప్రజలని హింసిస్తాడు. తనని కాదని బాహుబలి ని పెళ్లి చేసుకున్న దేవసేన ని చెరసాల లో బంధిస్తాడు. దేవసేన కి పుట్టిన బిడ్డని శివగామి పెంచుతుంది. బాహుబలి వారసుడి ని చంపాలని అనుకుంటాడు. కట్టప్ప ద్వారా ఆ విషయం శివగామి కి తెలుస్తుంది.

☄ బాహుబలి ని తన కొడుకు, భర్త కలసి చంపించారని శివగామి కి తెలుస్తుంది. భల్లాలదేవ, బాహుబలి కొడుకుని చంపుదామని ప్లాన్ వేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న శివగామి బాహుబలి కి పుట్టిన బిడ్డ తో రాజ్యం నుండి పారిపోతుంటే భల్లాలదేవ సైన్యం శివగామి ని చంపటానికి ట్రై చేస్తుంటారు. ఆ పోరు లో శివగామి ఆ పిల్లవాడిని నీటిలో పడకుండా ఒక గుడిసె వాళ్ళకి అప్పగించి చనిపోతుంది. ఇదంతా ప్రస్తుతం కట్టప్ప బాహుబలి కి జరిగిన అన్యాయం గురించి శివుడికి చెబుతాడు

☄ భల్లాలదేవ శివుడి మీద పగ తో రగిలిపోతుంటాడు. తన కొడుకు (బద్రుడు) ని చంపిన శివుడి మీద పగతో వున్న భల్లాలదేవ , మరో వైపు తన భర్త (బాహుబలి) చావు కి కారణం అయిన భల్లాలదేవా ని చంపుతానని శపథం చేసిన దేవసేన కసితో వుంటారు. శివుడు తనకంటూ ఒక రాజ్యా‌న్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాజ్యంకు కుంతలరాజ్యం తోడవుతుంది.. శివుడికి నమ్మిన బంటు గా కట్టప్ప వుంటే, వాళ్ళకి ఆయుధాలు సరపరా చేసే వ్యక్తిగా కిచ్చా సుదీప్ సహాయం చేస్తాడు. మహిస్మతి రాజ్యానికి, శివుడికి మధ్య జరిగే పోరులో మహిస్మతి రాజు అయిన భల్లాలదేవ శివుడి చేతిలో ఓడిపోతాడు.

మహిష్మతి రాజ్యం లో అందరూ చూస్తుండగా భల్లాలదేవ(రానా ) ని చితి మీద పేర్చి సజీవ దహనం చేస్తుంది. ఆ బాధ తట్టుకోలేక బిజ్జలదేవ తన కోడుకు చితిని చూస్తూ కన్నుమూస్తాడు.

Similar News