మెగా షాపింగ్ ఫెస్టివల్ ను ప్రకటించిన ముఖ్యమంత్రి
ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రోత్సహించడానికి.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా కీలక ప్రకటన చేశారు.
ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రోత్సహించడానికి.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా కీలక ప్రకటన చేశారు. 2023 సంవత్సరం ప్రారంభంలో దేశ రాజధాని ఢిల్లీలో 'మెగా షాపింగ్ ఫెస్టివల్'ని ప్రకటించారు. 2023 జనవరి 28 నుంచి 26 ఫిబ్రవరి 2023 వరకు 30 రోజుల పాటూ మెగా షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్ గురించిన వివరాలను కేజ్రీవాల్ తెలియజేస్తూ, అన్ని వస్తువులపై భారీ తగ్గింపులు ఉంటాయని, 30 రోజుల్లో 200 కాన్సర్ట్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు. ఒక మ్యూజిక్ ఫెస్టివల్ రేంజిలో ఆయన ఢిల్లీలో మెగా షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించబోతున్నారు. "ఢిల్లీలో ఉపాధి, వ్యాపారం, ఆర్థికంగా ఎదగాలని ఎదురుచూసే వాళ్లకు గొప్ప వార్త. 2023 సంవత్సరం ప్రారంభంలో ఢిల్లీలో ప్రపంచ స్థాయి షాపింగ్ ఫెస్టివల్ని నిర్వహిస్తుంది" అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇది వేళల్లో ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.