ఐశ్వర్య కూడా మోదీని కీర్తించిన వేళ...

Update: 2016-11-14 11:48 GMT

ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన పాప జననం తరువాత పత్రికా విలేకరులతో, మీడియా ప్రతినిధులతో ముచ్చట్టించటం పూర్తిగా మానుకుంది. తన కూతురు ఆధ్య జననం తరువాత ఆవిడ నటించిన చిత్రాల సంఖ్య కూడా కేవలం రెండు మాత్రమే. ఇటీవల విడుదల ఐన ఏ దిల్ హై ముష్కిల్ విజయం సాధించి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కి మొదటి 100 కోట్ల వసూళ్ల చిత్రంగా నిలవటమే కాక, ఆమెకు పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చింది. అయితే తన చిత్రాల గురించి కూడా ఎప్పుడూ పెద్దగా నోరు మెదపని ఐష్ ఇప్పుడు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కేంద్ర ప్రభుత్వ పని తీరు గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఒక వైపు దేశ ఆర్ధిక వ్యవస్థను తయారు మారు చేస్తుండగా, ఆ చర్య లోని దీర్ఘ కాళికా ప్రయోజనాలపై సామాన్య ప్రజలకు మరింత చైతన్యం కలిపించాలని అభిప్రాయపడింది ఐష్. "ఇంతటి సాహసోపేతమైన నిర్యాన్ని తీసుకోవటమే కాకుండా నిజాయితితో అమలు జరుపుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా లో వస్తున్న వార్తలు కానీ, ఇతర రాజకీయ పార్టీల ఆరోపణలు కానీ సామాన్య ప్రజలను కొంత ఆందోళనకి గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తేవటానికి ఈ నోట్ల రద్దు వలన జరిగే దీర్ఘ కాళికా ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరేలా కేంద్ర ప్రభుత్వమే జాగ్రత్తలు వహించాలి. అప్పుడే ఈ చర్య సక్రమంగా అమలు అవుతుంది." అని తన మనసులోని మాట వ్యక్తపరిచింది ఐశ్వర్య రాయ్ బచ్చన్.

Similar News