పూజ ని చూసి బాధపడుతున్న రష్మిక

సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురములో సినిమాల టీజర్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. రెండు టీజర్స్ లో మహేష్ యాక్షన్ అండ్ కామెడీ [more]

Update: 2019-12-12 06:06 GMT

సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురములో సినిమాల టీజర్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. రెండు టీజర్స్ లో మహేష్ యాక్షన్ అండ్ కామెడీ పరంగా, అల్లు అర్జున్ కామెడీ అండ్ మాసివ్ లుక్ తో అదరగొట్టేసాడు. అయితే ఈ రెండు టీజర్ లో ఉన్న ప్రధాన తేడా ఏమిటి అంటే… అల వైకుంఠపురములో టీజర్ లో త్రివిక్రమ్.. హీరోయిన్ పూజ కి అన్యాయం చెయ్యకుండా 80 సెకన్ల టీజర్ లో పూజ హెగ్డే ని కూడా పెట్టాడు. గ్లామర్ లుక్స్ తో పూజ, అల్లు అర్జున్ బాస్ గా ఆకట్టుకుంది.

కానీ అనిల్ రావిపూడి సరిలేరు టీజర్ లో అన్ని అంటే అందరు నటులను చూపించినా హీరోయిన్ రష్మికని చూపించకుండా దాచేసాడు. అయితే రష్మిక మీద స్పెషల్ టీజర్ అన్నప్పటికీ.. సరిలేరు టీం చడీచప్పుడు లేదు. ఇక ఇప్పుడు తాజాగా రష్మిక, అల వైకుంఠపురములో పూజ కిచ్చిన ఇంపార్టెన్స్ చూసి తెగ ఫీలవుతుందట. అంత పెద్ద సినిమా టీజర్ కట్ లో తనకి ప్లేసెలేదు కానీ.. మరో సినిమాలో పూజ ని దర్శకుడు ఎంత హైలెట్ చేసాడో కదా అని మధన పడుతుందట. ఇక రష్మిక ఫీలవడం అటుంచి… సోషల్ మీడియాలో కూడా ఆలా వైకుంఠములో పూజని చూసిన వారు.. సరిలేరు లో రష్మిక లేకపోవడంతో.. కామెడీ చేసేస్తున్నారు.

Tags:    

Similar News