మహేష్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఉందిగా

నిన్న బుధవారం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ సెట్స్ లో మహేష్ తో సెల్ఫీ దిగడానికి వచ్చి… మహేష్ ఫ్యాన్స్ తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి.. [more]

Update: 2019-12-26 12:57 GMT

నిన్న బుధవారం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ సెట్స్ లో మహేష్ తో సెల్ఫీ దిగడానికి వచ్చి… మహేష్ ఫ్యాన్స్ తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి.. అభిమానులు కాళ్ళు విరగ్గొట్టుకున్నారు అనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మరి మహేష్ బాబు క్రేజ్, సూపర్ స్టార్ రేంజ్ కాబట్టి.. ఆయన అభిమాన గణం మహేష్ ని చూడగానే ఎగ్జైట్ అవడం.. అలా ఫొటోస్ కోసం తోసుకోవడం సహజమే అనుకున్నారు అంతా. కానీ తాజాగా మహేష్ బాబు తో ఫొటోస్ కోసం తెల్లవారు ఝామునుండి లైన్ లో నించుకున్న మహేష్ ఫ్యాన్స్ కి.. సాయంత్రం మూడు గంటలకు మహేష్ తో ఫొటోస్ దిగే సమయానికి మహేష్ బాబు బౌన్సర్లు మహేష్ ఫ్యాన్స్ ని తోయ్యడమే కాకుండా కొట్టడంతో.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహేష్ అభిమానులు కాళ్ళు విరగ్గొట్టుకున్నారని అన్నారు.

అలాగే మహేష్ బాబు తో సెల్ఫీ కోసం మహేష్ కి తెలీకుండా సరిలేరు నీకెవ్వరూ యూనిట్ సభ్యులు మహేష్ ఫ్యాన్స్ నుండి రూ. 500 వసూలు చేసినట్టుగా మహేష్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అయితే ఇది మహేష్ వ్యక్తిగత సిబ్బంది కానీ, సరిలేరు యూనిట్ సభ్యులు కానీ.. మహేష్ ఫ్యాన్స్ నుండి డబ్బులు వసూలు చెయ్యలేదని, యూనిట్ పేరు చెప్పి కొంతమంది డబ్బు దందాకు పాల్పడ్డారని తెలుస్తుంది. అయితే ఈ రకమైన విషయాల వలన మహేష్ కి సంబంధం లేకపోయినా.. మహేష్ ఇమేజ్ డ్యామేజ్ జరగడం మాత్రం పక్కా.

Tags:    

Similar News