కోలీవుడ్ సినిమాకి బై బై చెప్పేసిన సమంత?

సమంత జానూ సినిమా తర్వాత తెలుగులో మరే తెలుగు సినిమాకి సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార తో కలిసి విజయ్ [more]

Update: 2020-03-07 05:48 GMT

సమంత జానూ సినిమా తర్వాత తెలుగులో మరే తెలుగు సినిమాకి సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార తో కలిసి విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్న సినిమాకి ఓకె చెప్పడం.. షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే ఆసినిమా టీజర్ లో సమంత – నయనతార గొడవపడుతున్నట్టుగా ఉన్న సీన్స్ అందరిని ఆకట్టుకుంది. ఇక సమంత కూడా ఇంతవరకు తాను ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ వినలేదని.. నయనతార లాంటి టాలెంటెడ్ హీరోయిన్ తోనూ, విజయ్ సేతుపతి లాంటి హీరో తో కలిసి సినిమా చేస్తున్నందుకు గర్వం గా ఉందని ఆ సినిమా ముచ్చట్లు చెప్పింది. ఇక కోలీవుడ్ లో ఈ సినిమా, అమెజాన్ ప్రైమ్ ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తప్ప సమంత చేతిలో సినిమాలేవీ లేవు అని.. ఇక ఆమె సినిమాలు తగ్గించి, నిర్మాణ రంగంలోనూ, స్కూల్ బిజినెస్ లోను బిజీ కానుంది అని అనుకున్నారు.

తాజాగా కోలీవడ్ సినిమా నుండి సమంత బయటికొచ్చేసింది అనే టాక్ మొదలయ్యింది. నయనతార – విజయ్ సేతుపతి సినిమా నుండి సమంత సడన్ గా తప్పుకున్నట్లుగా కోలివుడ్ మీడియాలో ఓ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. కారణాలు తెలియవు కానీ.. సమంత ప్రెగ్నెంట్ అయిన కారణంగానే ఆ సినిమా వదులుకుంది అని, కాదు నయనతార తో విభేదాల కారణంగా సమంత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అని, నయనతార బాయ్ ఫ్రెండ్ దర్శకుడు విగ్నేష్ శివన్ నయనతార కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన కారణమగానే సమంత ఈ బడా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి అసలు సమంత తప్పుకుంది, తప్పుకుంటే దాని వెనుక కారణమేమిటి అనేది సమంత స్పందిస్తేనే కానీ తెలియదు

Tags:    

Similar News