పవన్ సినిమాకి నిర్మాత కావలెను

అందరిలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఓ డ్రీం ప్రాజెక్ట్ ఉంది. ఎప్పటినుండో సత్యాగ్రహి అనే సోషల్ మెసేజ్ ఫిల్మ్ చేయాలని పవన్ కళ్యాణ్ [more]

Update: 2020-02-26 06:40 GMT

అందరిలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఓ డ్రీం ప్రాజెక్ట్ ఉంది. ఎప్పటినుండో సత్యాగ్రహి అనే సోషల్ మెసేజ్ ఫిల్మ్ చేయాలని పవన్ కళ్యాణ్ కలలు కన్నాడు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ చిత్రాన్ని A M రత్నం నిర్మాణంలో మొదలెడదామనుకుంటే… చాలా కారణాల వలన ఈ చిత్రం ఆపేసాడు పవన్ కళ్యాణ్. అప్పటినుండి ప్రాజెక్టును పునరుద్ధరించడానికి చాలా ప్రయత్నాలే చేసారు. కానీ అది జరగలేదు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని లైన్ లోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా.. తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాని లైన్ లోకి తేవడానికి డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ కోసం పోరాడుతున్నాడు. అందుకే ఈ సత్యాగ్రహి చిత్రం తన రాజకీయ జీవితానికి ఎంతో సహాయపడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడని.. అందుకే ప్రస్తుతం సత్యాగ్రహి స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమాని నిర్మించేందుకు నిర్మాతలెవరూ ముందు కు రావడం లేదని ఫిలింనగర్ టాక్. ఈ ప్రాజెక్టుపై భారీగా పెట్టుబడి పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరని తెలుస్తోంది… ఎందుకంటే పవన్ కళ్యాణ్ రచన లేదా దర్శకత్వంలో పాల్గొన్నప్పుడల్లా ఆ సినిమాలు ప్లాప్ అవుతున్నాయనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారట. అందుకే ఎవరూ ముందుకు రావడం లేదని ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి

Tags:    

Similar News