నిర్మాతలను పిలిచి చివాట్లు పెట్టిన పవన్?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు. మాములుగా రాజకీయాల్తో బిజీ ఉండాల్సిన టైం లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఓపక్క అమరావతి ప్రాబ్లెమ్, [more]

Update: 2020-01-23 05:11 GMT

పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు. మాములుగా రాజకీయాల్తో బిజీ ఉండాల్సిన టైం లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఓపక్క అమరావతి ప్రాబ్లెమ్, మరో పక్క కొత్త రాజధానుల పై పోరాటంతో పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం అయ్యేసరికి అమరావతికి వచ్చేస్తున్నాడు. పొద్దున్నే పింక్ రీమేక్ అంటూ హైదెరాబాదుకి వెళుతున్నాడు. రాజకీయాలు హాట్ హాట్ గా వున్నప్పుడు పవన్ సినిమాలు చెయ్యడం కరెక్ట్ కాదు. కానీ ఒప్పుకున్నాక చెయ్యక తప్పదు. అందుకే సినిమాల్లోకి రీ ఎంట్రీ విషయాన్నీ ఎక్కడ చెప్పకుండా సైలెంట్ గా పింక్ రీమేక్ షూటింగ్ లో హాజరయ్యాడు పవన్.

అసలు పవన్ కళ్యాణ్ జనవరి 20 నుండి పింక్ రీమేక్ చేస్తున్నాడు అని మూవీ టీం కానీ, దిల్ రాజు కానీ చెప్పకుండానే పవన్ సినిమా లాయర్ సాబ్ పిక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దానితో పవన్ ఫ్యాన్స్ ఆనందంతో.. ఆ పిక్ ని వైరల్ చేసి పడేశారు. ఆసలే సినిమాలు చేసుకుంటున్నాడంటూ రాజకీయా నేతలు తనని ఫుడ్ బాల్ ఆడుకుంటారని తెలిసిన పవన్ సైలెంట్ గా పింక్ రీమేక్ పూర్తి చేద్దామనుకుంటే.. ఇక్కడ లీకైన పిక్ తో పవన్ సినిమాలు చేసుకుంటాడు డబ్బు సంపాదిస్తున్నాడు.. ఇక అమరావతి ప్రజలకేం న్యాయం చేస్తాడంటూ గొడవ చేస్తుండడంతో…. పవన్ కి బాగా కాలి.. పింక్ రీమేక్ నిర్మాత ని పిలిచి సెట్స్‌లోని ఫొటోలు లీక్ అవడంపై ఫైర్ అయ్యాడట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనందుకు నిర్మాతలపై మండిపడినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. పవన్ దెబ్బకి నిర్మాతలు సెట్స్‌లో భారీ సెక్యూరిటీని పెంచినట్లుగా తెలుస్తోంది

Tags:    

Similar News