చిరు ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచాడా?

చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన సై రా నరసింహారెడ్డి చిరు ని బాగా నిరాశపరిచింది. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా కేవలం తెలుగోళ్ళకి మాత్రమే నచ్చింది [more]

Update: 2019-12-01 12:30 GMT

చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన సై రా నరసింహారెడ్డి చిరు ని బాగా నిరాశపరిచింది. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా కేవలం తెలుగోళ్ళకి మాత్రమే నచ్చింది కానీ…. మిగతా భాషలన్నీ సై రా ని పట్టించుకోలేదు. తెలుగులో హిట్ అయిన సై రా ఇతర భషాల్లో ప్లాప్ కాదు డిజాస్టర్ గా నిలిచింది. అందునా హిందీలో సై రా ఘోరంగా ఓడిపోయింది. సై రా చూసిన వాళ్ళు అంతగాదు ఇంత అన్నారు కానీ… సినిమాకి కలెక్షన్స్ రాలేదు. అయితే ఇన్నాళ్ళకి సై రా పోవడానికి కారణాలు వెతికే పనిలో చిరు ఉన్నాడని ఫిలింనగర్ లో వినబడుతుంది.

అసలు సై రా కి అయిన ఖర్చులో.. సినిమా కి ఎంత ఖర్చు అయ్యింది, దుబారాగా ఎంత ఖర్చు అయ్యింది, బాలీవుడ్ లో సినిమా ఫెయిల్ అవడానికి కారణమేమిటి, ఇతర భాషల్లోనూ సై రాకి క్రేజ్ ఎందుకు రాలేదు, అనే దానిమీద చిరు సమీక్ష చేసాడని, అలాగే సై రాకి అయిన ఖర్చు, వచ్చిన కలెక్షన్స్ లెక్కలు అన్ని పకడ్బందీగా లెక్కలు రాపించి పెట్టాడని చెబుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటి రైడ్స్ జరుగుతన్న కారణంగా చిరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడని టాక్. ఇక సై రాకి అయినా బడ్జెట్ లో చాలావరకు నటుల పారితోషకాలే అయ్యింది, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి వాళ్ళకి భారీగా పారితోషకాలు ఇవ్వడం కూడా సై రా బడ్జెట్ పెరగడానికి కారణమని చిరు సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. అయితే ఇవన్నీ చూసినా చాలామంది చిరు ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచాడా అంటున్నారట.

Tags:    

Similar News