ఎట్టకేలకు మొగుడు పెళ్ళాన్ని లైన్ లో పెట్టాడా?

గీత గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్ సినిమా ఏది పట్టాలెక్కలేదు. స్టార్ హీరోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ.. పరశురామ్ ని పట్టించుకున్న పాపన పోలేదు. చివరికి [more]

Update: 2019-11-24 06:53 GMT

గీత గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్ సినిమా ఏది పట్టాలెక్కలేదు. స్టార్ హీరోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ.. పరశురామ్ ని పట్టించుకున్న పాపన పోలేదు. చివరికి పరశురామ్ యుంగ్ హీరో నాగ చైతన్య దగ్గర ఆగినట్లుగా వార్తలొస్తున్నాయి. దాదాపుగా నాగ చైతన్య తో పరశురామ్ సినిమా ఖాయమని, ఆ సినిమాని 14 రీల్స్ నిర్మాతలు తెరకెక్కిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. పరశురామ్ చెప్పిన కథ కి నాగ చైతన్య కనెక్టయ్యాడని తెలుస్తుంది. అయితే చైతు తో మాత్రమే కాకుండా సమంత తో కూడా పరశురామ్ సినిమా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.

నాగ చైతన్య వెంకిమామ, శేఖర్ కమ్ముల సినిమాల తర్వాత పరశురామ్ సినిమా కోసం రెడీ అవుతాడట. అంటే అజయ్ భూపతి మహా సముద్రానికి చైతు హ్యాండ్ ఇచ్చినట్లే అన్నమాట. ఇక చైతు సినిమా తర్వాత పరశురామ్ సమంత తో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీని చేయబోతున్నట్లుగా.. ఇప్పటికే సమంత కి కథ చెప్పి కమిట్మెంట్ పొందినట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పటివరకు సినిమా కోసం తెగ తిరిగిన పరశురామ్ ఇలా ఒకేసరి మొగుడు, పెళ్ళాం సినిమాల్తో బిజీ కాబోతున్నాడన్నమాట. సినిమా సినిమాకి గ్యాప్ వస్తే వచ్చింది కాని… పరశురామ్ కి చైతు – సామ్ లు ఓకె చెబితే సుడి తిరిగినట్లే.

Tags:    

Similar News