కరోనా తో కంగారు పడుతున్న కమెడియన్?

ప్రస్తుతం కరోనా వైరస్ తో సినిమా షూటింగ్ లకు బ్రేక్స్ పడుతున్నాయి. అలాగే సినిమా ఫంక్షన్స్ వాయిదాలు పడుతున్నాయి. ఇక థియేటర్స్ కూడా మూతబడనున్నాయనే ప్రచారం జోరుగా [more]

Update: 2020-03-07 07:05 GMT

ప్రస్తుతం కరోనా వైరస్ తో సినిమా షూటింగ్ లకు బ్రేక్స్ పడుతున్నాయి. అలాగే సినిమా ఫంక్షన్స్ వాయిదాలు పడుతున్నాయి. ఇక థియేటర్స్ కూడా మూతబడనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఇప్పుడు కరోనా వైరస్ అంటే ఓ కమెడియన్ కంగారు పడుతున్నాడు. అతనే సరిలేరు నీకెవ్వరూ తో మల్లి కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్. గత కొంతకాలంగా కామెడీకి, నిర్మాతగా సినిమాలకు దూరమైనా బండ్లగణేష్ సరిలేరు నీకెవ్వరూ తో దూసుకుపోతాడనుకుంటే.. ఆసినిమాలో బండ్ల కామెడీకి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే తాజాగా కరోనా తో బండ్ల ప్రాబ్లెమ్ ఏమిటి అంటే…

కరోనా వైరస్ వల్ల కోడి మాంసం తినొద్దు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడం, చికెన్ తింటే కరోనా గ్యారెంటీ అంటూ చెప్పడంతో.. ప్రస్తుతం దేశంలోని ఫౌల్ట్రీ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. చికెన్ తినొచ్చని కేటీఆర్ లాంటి పొలిటిషన్ ఎంత చెప్పినా జనాలు వినే పరిస్థితిలో లేరు. దానితో చికెన్, గుడ్ల వ్యాపారం ఢమాల్ అంది. దానితో బండ్లకి కనెక్షన్ ఏమిటి అంటే.. బండ్ల గణేష్ సినిమాలు చేస్తూ బిజినెస్ లు స్టార్ట్ చేసి బిజినెస్ మ్యాన్ అవతారమెత్తాడు. అందులో బండ్ల గణేష్ తెలంగాణాలో ఫౌల్ట్రీ వ్యాపారి. ఇక్కడ షాద్ నగర్ లో బండ్ల కి బోలెడన్ని కోళ్ల ఫారాలు ఉన్నాయి. సినిమాలు లేనప్పుడు బండ్ల అక్కడ కోళ్ల బిజినెస్ లో బిజీగా ఉంటాడు. చాలా ఏళ్లుగా గుడ్లు, కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు బండ్ల. తెలంగాణాలో బడా ఫౌల్ట్రీ వ్యాపారుల్లో బండ్ల ఒకడు. మరి కరోనా తో ఫౌల్ట్రీ వ్యాపారం దెబ్బతినడడంతో బండ్ల గణేష్ నెత్తినోరు కొట్టుకుంటున్నాడట. తాను బిజినెస్ లో భారీగా లాస్ అయ్యా అంటూ సన్నిహితుల దగ్గర మొరపెట్టుకుంటున్నాడట.

Tags:    

Similar News