మీడియా మీద ఫైర్ అవుతున్నాడు

తమ మీద ఏ రూమర్స్ వచ్చినా.. అందులో నిజాలున్నా.. లేకపోయినా.. ఈమధ్యన యాంకర్స్ చాలామంది మీడియా మీదఫైర్ అవడం పరిపాటిగా మరింది. మొన్నామధ్యన అనసూయ తమ ఇంటి [more]

Update: 2020-02-04 05:25 GMT

తమ మీద ఏ రూమర్స్ వచ్చినా.. అందులో నిజాలున్నా.. లేకపోయినా.. ఈమధ్యన యాంకర్స్ చాలామంది మీడియా మీదఫైర్ అవడం పరిపాటిగా మరింది. మొన్నామధ్యన అనసూయ తమ ఇంటి మీద జీఎస్టీ అధికారులు దాడులు చెయ్యలేదని.. నేను జీఎస్టీ పర్ఫెక్ట్ గా కడుతున్నా అంటూ వాస్తవాలు తెలుసుకోకుండా తమ మీద మీడియా లేనిపోని వార్తలను రాస్తుంది అంటూ ఫైర్ అయ్యింది. తాజాగా యాంకర్ కం హీరో ప్రదీప్ మాచిరాజు కూడా మీడియా మీద ఫైర్ అవుతున్నాడు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ సూక్తులు చెప్పి మీడియాకి కి అడ్డంగా దొరికి కోర్టుకి వెళ్లొచ్చిన ప్రదీప్ మరోసారి బుక్ అయిన విషయం తెలిసిందే.

అదేమిటంటే ప్రదీప్ ఓ అమ్మాయిని వేధించిన కేసులో రెండు రోజులు జైల్లో గడిపాడని అలాంటి ప్రదీప్ తో సినిమా చెయ్యడం ఆపెయ్యాల ని రెండు రోజుల క్రితం యంగ్ డైరెక్టర్ సునిశిత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు అయితే తాజాగా తన మీద వస్తున్నా వార్తలకు ప్రదీప్ స్పందించాడు. తాను జైలుకెళ్లినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాత్రం కౌన్సిలింగ్ కి మాత్రం వెళ్ళా అని… అసలు తనపై కేసు పెట్టిన సునిశిత్ ఎవరో కూడా తెలియదని, అతని పేరు ఫస్ట్ టైం వింటున్నా అని చెప్పిన ప్రదీప్.. మీడియా నిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి రాయడం తగదని చెబుతున్నాడు.

Tags:    

Similar News