వైసిపి ని తిడుతూ సినిమావాళ్ళకి పొగడ్తలా..?

గత ఎన్నికల టైం లో వైసిపి తీర్థం పుచ్చుకుని.. సినిమా వాళ్ళని బహిరంగంగా కడిగిపారేసి.. రాజకీయాల్లో చక్రం తిప్పుదామని రాజకీయనాయకుల చేతిలో బలైపోయిన 30 ఇయర్స్ పృద్వి [more]

Update: 2020-03-10 06:18 GMT

గత ఎన్నికల టైం లో వైసిపి తీర్థం పుచ్చుకుని.. సినిమా వాళ్ళని బహిరంగంగా కడిగిపారేసి.. రాజకీయాల్లో చక్రం తిప్పుదామని రాజకీయనాయకుల చేతిలో బలైపోయిన 30 ఇయర్స్ పృద్వి రాజ్ ఇప్పడు రాజకీయాలను తిడుతూ సినిమా వాళ్ళని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నాడు. తిరుపతిలో ఎస్వీబిసి చైర్మన్ గా కన్ను మిన్ను కానకుండా సినిమా వాళ్లని బూతులు తిట్టడం, జగన్ సీఎం అవడం ఇష్టం లేకనే సినిమా పెద్దలెవరూ జగన్ ని కలవలేదంటూ.. సినిమా ప్రముఖులను ఏదో చేద్దామని.. ఇప్పుడు రాజకీయాలతో జీరో అయ్యాక సినిమా వాళ్ళ విలువ తెలిసొచ్చి.. చివరికి సినిమాలే గతి అన్నట్టుగా ఇప్పుడు పృద్వి తీరు ఉంది.

ఎస్వీబిసి చైర్మన్ గా ఆరోపణలు ఎదుర్కుంటున్న పృద్వి ఆ పదవికి రాజీనామా చేసాక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళ వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికీ రాజకీయాల వల్ల తాను బలైపోయా అని.. సొంత పార్టీ నాయకులే తనని బలి చేసారని.. సుబ్బారెడ్డి కోరడంతోనే తాను రాజీనామా లేఖను సమర్పించినట్టు.. జగన్ తనని రాజీనామా చెయ్యమని చెప్పలేదని.. వాపోతున్నాడు. తనను ఈ ఎపిసోడ్ లో చెప్పుతో కొట్టినట్టుగా బయటకి పంపేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. అయితే సినిమా పెద్దలైన చిరు ని పొగిడే కార్యక్రమం పెట్టాడు. చిరు వలన తాను ఇప్పటికి బ్రతికున్నా అని.. చిరు వలనే తన కుటుంబం ఇంకా బ్రతికుందని… నాకు వేషాలు ఇచ్చి ఎంక‌రేజ్ చేయాల‌ని చిరంజీవి చెప్పారని చెబుతున్నాడు. మరి ఇప్పటి వరకు రాజకీయాలను చూసి మిడిసిపడిన పృద్వి ఇప్పుడు సినిమా అవకాశాలు కోసం అందరి కాళ్ళు పట్టుకునేటట్లు కనబడుతున్నాడు.

Tags:    

Similar News