పవన్ కళ్యాణ్ - మహేష్ కత్తి కలిసి చేసిన ఒకే ఒక్క పాజిటివ్ పని ఇదే

Update: 2017-12-10 11:57 GMT

మహేష్ కత్తి - తెలుగు రాష్ట్రాల జనాలకి ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పేరు కాదు ఇది . పవన్ కళ్యాణ్ మీదా ఆయన పార్టీ జనసేన మీదా అతని ఫాన్స్ మీదా చాలా కాలంగా గళం ఎత్తుతున్న మహేష్ కత్తి, తాజాగా పవన్ నాలుగు రోజుల పర్యటన గురించి కూడా రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పార్టీ అసలు రికగ్నైజ్ అయిన పార్టీ కానే కాదు అంటూ టీవీ డిబేట్ లో కూర్చున్న మహేష్ కత్తి అనేక విషయాల మీద మాట్లాడాడు.

మరొక పక్క టీవీ ఛానళ్ళు పవన్ కళ్యాణ్ చలోరే టూర్ ని బాగా దగ్గర నుంచి కవర్ చేసాయి. పవర్ స్టార్ మొదట DCI ఉద్యోగుల దగ్గర తన యాత్ర మొదలు పెట్టింది మొదలు, ప్రతీ చోటా అచ్చమైన కవరేజీ అందించారు. ఒంగోలు లో ఆఖరి సారి పవన్ మాట్లాడే వరకూ మినిట్ టూ మినిట్ కవరేజీ ఇచ్చిన మీడియా కి అద్భుతమైన టీఆర్పీ వచ్చింది అని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక ఛానల్ వారికి గత నాలుగైదు రోజులుగా డబల్ టీఆర్పీ వచ్చింది అనీ ఇది అసలు ఊహించని విశేషం అనీ చెబుతున్నారు చాలా మంది.

పవన్ కళ్యాణ్ - కత్తి మహేష్ ఇద్దరూ కలిస్తే ఈ మాత్రం టీఆర్పీ రాదా ఏంటి అనేది విశ్లేషకుల వాదన. ఒక పక్క పవన్ పర్యటన మరొక పక్క పవన్ అసలు రాజకీయాలకి పనికిరాడు అంటూ మహేష్ గోల, ఈ దెబ్బకి చానెల్స్ టీఆర్పీ పైకెక్కి కూర్చుంది.

Similar News