నాగార్జున తో గొడవ విషయం లో ఓపెన్ అయిపోయిన సుమంత్

Update: 2017-12-10 12:13 GMT

అక్కినేని నాగేశ్వరావు గారి మనవడు హీరో సుమంత్ కీ నాగార్జున కీ మధ్యన ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి అనే వార్త హల్చల్ అయ్యింది. వీరిద్దరికీ మధ్య ఆస్తుల పంపకం విషయం లో తేడా వచ్చింది అనీ అందుకే ఒకప్పటి లాగా సుమంత్ బాగోగులు చూడడం దగ్గర నుంచీ ఏ విషయం లోనూ నాగార్జున ఇన్వాల్వ్ కూడా అవ్వడం లేదు అనే పుకార్లు గుప్పుమన్నాయి.

‘మనం’ సినిమా రిలీజ్ టైంలో సుమంత్ దూరంగా ఉండటం.. ఆ తర్వాత కూడా నాగార్జునతో పెద్దగా కలిసి కనిపించకపోవడంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో దీనికి ఆన్సర్ చేసాడు హీరో సుమంత్ .. " మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు. అలాంటి వార్తలు నేను అసలు పట్టించుకోవడం లేదు, ఎప్పుడూ పట్టించుకోను కూడా.. నాకూ కీర్తీ రెడ్డి కీ మధ్యన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఇలాగే రాసారు , అప్పుడూ నేను ఇలాగే అనుకున్నాను " అన్నాడు సుమంత్ .. ఇక తనకు తన మావయ్యతో గొడవలెందుకుంటాయని సుమంత్ ప్రశ్నించాడు. మళ్ళీ రావా స్పెషల్ స్క్రీనింగ్ ని కూడా నాగార్జున కోసం ఏర్పాటు చేసాను అని అతను చెబుతున్నాడు.

Similar News