తెలుగువారి కోసం అయితే ఐదు నిమిషాలకి ఐదు కోట్లు ఇమ్మన్న ప్రియాంక చోప్రా

Update: 2017-12-16 09:52 GMT

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా క్రేజ్ ఉన్న కొద్దీ ఆకాశంలోకి ఎక్కుతుంది, ఈ అమ్మడు సక్సెస్ ఇప్పుడు బాలీవుడ్ నుండి మరింత సక్సెస్ఫుల్ గా హాలీవుడ్లో దూసుకెళ్తుంది. ఇంతటి చరిష్మా కలిగిన ప్రియాంక చోప్రా ఐదు, నిమిషాలకు 5 కోట్లు పారితోషికం తీసుకుంటుంది అనేది తాజాగా నడుస్తున్న హాట్ టాపిక్ .

అంత ఇచ్చుకునేందుకు ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్ సిద్ధమైంది కూడా. ఐదు నిమిషాలకు ఐదు కోట్లు అందుకోవడం వింటుంటేనే చెవులు గుయ్యి మంటున్నాయి, వినడానికే షాక్ గా ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఆ ఐదు నిముషాలు కూడా స్టేజి మిధ తన డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయబోతుంది ఆమె .ఇదంతా జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఆధ్వర్యంలో అవార్డు కార్యక్రమములో కనిపించడానికి తీసుకున్న పారితోషికం ఈ క్రమంలో టాలీవుడ్ దిగ్గ‌జాలందరికీ చిరంజీవి , బాలయ్య సహా ఇతరులకు జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇన్విటేష‌న్లు పంపించింది.

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఈ వేడుక‌ల్లో ఏదో ఒక ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కావాలి కాబ‌ట్టి , ఆ ఆక‌ర్ష‌ణ ప్రియాంక చోప్రా అయితే బావుంటుంద‌ని జీ-వాళ్లు భావించారట‌.ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా ను సంప్రదిస్తే 5 కోట్లు డిమాండ్ చేసిందిట‌. దీనికి యజమాన్యం ఓకే అనటం తో ప్రియాంక చోప్రా లైవ్ పెర్ఫామెన్స్‌కి లైన్ క్లియ‌రైంది.పీసీ రాక‌తో జీ చానెల్ అవార్డుల‌కు కొత్త క‌ళ వ‌చ్చిన‌ట్టే

Similar News