తెలుగు అమ్మాయిల లేటెస్ట్ ఫ్యాషన్ - మొఖం మీద మొటిమలు

Update: 2017-12-06 10:20 GMT

ఏదైనా సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా హీరోలని అనుకరించడం, వారి లాగా బట్టలు వేసుకోవడం - తల దువ్వుకోవడం - ఫైట్ లు చేస్తున్నట్టు ఎగరడం - కాళ్ళూ చేతులూ విరక్కొట్టు కోవడం ఇవన్నీ చాలా మంది చేసేవే.

అయితే తాజాగా ప్రేమం సినిమా తో ఫేమస్ అయ్యి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాయి పల్లవి ఒక కొత్త ఒరవడి ని తెలుగు రాష్ట్రాల్లో సృష్టిస్తోంది. సాయి పల్లవి అనగానే ఆమె ముఖమే గుర్తుకు వస్తుంది మనకి. మొటిమల తో నాచురల్ బ్యూటీ అని పిలుస్తారు చాలామంది సాయి పల్లవి ని. అదే ట్రెండ్ ని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల టీనేజ్ అమ్మాయిలు ఫాలో ఐపోతున్నారట. అవును .. తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలు ఒకప్పటి లాగా మొఖం మీద మొటిమలు ఎక్కువ అయితే బాధ పడ్డం లేదు సరికదా అవి రావడం కోసం నూనె ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారట. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలూ అందరూ ఈ మొటిమల ఫ్యాషన్ ని ఎక్కువగా పాటిస్తున్నారు అని ఒక తాజా సర్వే చెబుతోంది. దీనంతటికీ కారణం సాయి పల్లవే నట. ప్రస్తుతం తెలుగులో నాని , శర్వానంద్ లతో రెండు సినిమాలు చేస్తున్న ఆమె మలయాళం లో కూడా బిజీ గా ఉంది.

Similar News