తన స్వార్ధం కోసం, ఫుల్లుగా వాడుకుంటున్న రాజమౌళి !!

Update: 2017-12-06 10:25 GMT

మొన్నామధ్య ట్విట్టర్ లో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఫోటో వేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో తో నిమిషాల్లో ట్విట్టర్ , ఫేస్ బుక్ , మెయిన్ స్త్రీం మీడియా మొత్తం రచ్చ రచ్చ ఐపోయింది. ఎవరూ ఊహించని మెగా - నందమూరి హీరోలతో రాజమౌళి సినిమా అంటూ ప్రచారం జరిగింది.

అయితే అది ఒకరకంగా నిజం అనే అంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి అడిగినట్టు అద్భుతమైన కథ రాస్తున్నాడు అనీ ఇప్పటికే యాభై శాతం పూర్తి ఐన ఈ కథ పవర్ ఫుల్ గా వచ్చింది అనీ తెలుస్తోంది. అయితే విషయానికి వస్తే రాజమౌళి తన తండ్రితో చాలా స్త్రిక్ట్ట్ గా ఒక స్పోర్ట్స్ కథ లేదా ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ కథ రాయాలని కోరాడట , పొరపాటున కూడా VFX వాడే కథ అయ్యి ఉండకూడదు అనేది రాజమౌళి తండ్రికి పెట్టిన కండిషన్. దానికి కారణం ఏంటంటే బాలీవుడ్ లో మౌళి ని ఈగ , బాహుబలి తీసిన డైరెక్టర్ గా చూస్తారు.

ఇండియా లోనే ఎవరూ వాడని గ్రాఫిక్ మాయాజాలం వాడగాలిగిన డైరెక్టర్ గా మాత్రమే అతనికి అక్కడ గుర్తింపు ఉంది , అందుకనే ఒక స్పోర్ట్స్ స్టోరీ అంటే అక్కడి పెద్ద హీరోలు ఎవరూ మౌళి కి డేట్ లు ఇవ్వలేదట.. సో వీరిద్దరితో తన ఎమోషనల్ సైడ్ , నాన్ గ్రాఫిక్ సినిమా తీసే సత్తా ఏంటో వారికీ ప్రూవ్ చేసుకోవాలి అని రాజమౌళి తహతహ లాడుతున్నాడు అని తెలుస్తోంది. ఈ దెబ్బతో తాను అన్ని రకాల సినిమాలూ హ్యాండిల్ చెయ్యగలను అని తెలుగు హీరోలని వాడుకుని మరీ బాలీవుడ్ లో ప్రూవ్ చేస్తాడు మన మౌళి సారు .

Similar News