కన్నీటి పర్యంతమైన మహేష్ బాబు

Update: 2017-12-15 09:08 GMT

ఘట్టమనేని కుటుంబానికీ శాఖమూరి వారి కుటుంబానికీ మధ్యన చాలా దగ్గర బంధుత్వం ఉంది. శాఖమూరి కుటుంబం లోంచి చాలా మంది నిర్మాతలుగా, హీరో లుగా కూడా వచ్చి ఉన్నారు. కృష్ణ కి మ్యానేజర్ లు గా వారి డేట్ లు చూసినవారు అనేకం.

అయితే ఇప్పుడు రీసెంట్ గా మహేష్ బాబు కి మామయ్యా వరస ఐన శాఖమూరి రాంబాబు అలియాస్ పద్మాలయ రాంబాబు చనిపోయిన సంగతి తెలిసిందే. మహేష్ కి ఆయనకీ మధ్యన చాలా గట్టి బంధం ఉంది. పర్సనల్ మ్యానేజర్ గా రాంబాబు మహేష్ దగ్గర చాలా కాలం పనిచేసారు. ఈయన మృతి తో మహేష్ తన సొంత మనిషిని కోల్పోయినందుకు చాలా బాధ పడుతున్నాడు అనీ విషయం తెలియగానే మహేష్ కంట్లోంచి నీళ్ళు కూడా వచ్చాయి అని అంటున్నారు.

ఒకప్పుడు మహేష్ అన్న రమేష్ బాబు ని ప్రొడ్యూస్ కూడా చేసిన ఈయన మహేష్ ని చిన్నతనంనుంచీ దగ్గరుండి పెంచారు. పద్మాలయా స్టూడియోస్ కి హెడ్ గా ఉండి అక్కడ అన్ని పనులూ చూసుకుంది ఈయనే మరి. అలాంటి వ్యక్తి మరణం తరవాత మహేష్ చాలా డిప్రెషన్ లో ఉన్నాడు అంటున్నారు. రామ్ బాబు అంత్యక్రియలు హైదరాబాద్ లో జరిగాయి.

Similar News