ఏ ప్రొడ్యూసర్ పవన్ టార్గెట్ ?

Update: 2017-12-20 11:02 GMT

పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రం కాంబినేషన్లో వస్తున్న “అజ్ఞాతవాసి” యొక్క చిత్రం ఆడియో హైదరాబాద్ నోవాటెల్ లో ఘనంగా జరిగింది. ఈ ఆడియో వేడుకలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మాటలు హై లైట్ లు నిలిచాయి. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు అందరిలో వీరు ఒకరు అంటూ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ వారి కష్టాన్ని వేడుకకు వచ్చిన అభిమానులకు తెలిపారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కళ్యాణ్ నట విశ్వరూపం చూస్తారని అన్నారు. చివరలో హీరో కళ్యాణ్ మాట్లాడుతూ అనేక ఆసక్తికరకరమైన వ్యాఖ్యలు చేశారు. నా జీవితం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు అభిమానులు నాకు అండగా నిలబడ్డారు అనీ , అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమాకు తక్కువ ఖర్చు పెట్టి లాభాలు దండుకోవాలని నిర్మాతలు ఇండస్ట్రీని ఏలుతున్నారు అంటూ ఎవరినో ఉద్దేశించి కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తన చిత్రమైన జల్సా గురుంచి మాట్లాడుతూ జల్సా చిత్రం విజయం సాధించింది, డబ్బులు వచ్చాయి అని నాకు తెలియడానికి మూడేళ్లు పట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు.

అయితే డబ్బులు దండే నిర్మాతలు అంటూ పవన్ కళ్యాణ్ శరత్ మరార్ మీదనే కౌంటర్ వేసాడు అంటూ చాలా మంది కామెంట్ లు చేస్తున్నారు. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ కీ కాటమరాయుడు కి డబ్బులు పెట్టింది శరత్ మరార్ అయితే డిస్ట్రిబ్యూటర్ లని ఆయన నిలువునా ముంచేశాడు అనీ అందుకే పవన్ కే శరత్ కీ అస్సలు పడ్డం లేదు అనే టాక్ ఉంది.

Similar News