అల్లు అర్జున్ నిర్మాణం ఐడియా వెనకాల ఉంది ఆయనే

Update: 2017-12-22 11:15 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా మీద క్లారిటీ ఇంకా రాలేదు. అయితే సోషల్ మీడియాలో వక్కంతం వంశీ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా కి కొత్త డైరెక్టర్ ను అర్జున్ పరిచయం చేయబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది .

అయితే ఈ వార్త విన్న ఇండస్ట్రీ వర్గాలు కూడా అవుననే చెబుతున్నాయి. ఒక కొత్త స్క్రిప్ట్ అల్లూ అర్జున్ కి విపరీతంగా నచ్చేసిందట .. ఈ సినిమా స్టోరీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇక్కడ సరికొత్త విషయమేమిటంటే ఈ సినిమాను స్వయానా అల్లు అర్జున్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఒక కొత్త దర్శకుడు,కొత్త నిర్మాత అయిన బన్నీ కలయికలో వస్తున్న సినిమా నా పేరు సూర్య తర్వాత పట్టాలెక్కుతోంది. ఇప్పటిదాకా నిర్మాత రంగంలో వేలు పెట్టని అల్లు అర్జున్ తన సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ కాదనుకుని ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అందరికి ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ క్రమంలో అల్లు అర్జున్ తీసుకున్న తాజా నిర్ణయంతో చరణ్ రూట్ లోకి వెళ్లాడని అందరూ అంటున్నారు.

ఇప్పటికే రామ్ చరణ్ తన తండ్రి హీరోగా ఒక హిట్ సినిమా నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. అలాగే అర్జున్ కూడా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. అయితే ఈ సినిమా వచ్చే మే నెలలో ప్రారంభమౌతుందని కొండ న్నారు.ఈ అతిపెద్ద నిర్ణయం లో అల్లూ అర్జున్ వెనక అల్ల అరవింద్ ఉన్నారు అని తెలుస్తోంది. చరణ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ఈ క్రమం లో తన కొడుకుని కూడా ప్రొడ్యూసర్ ని చేస్తే గీతా ఆర్ట్స్ భవిష్యత్తు ని అతనే చూసుకోవాలి అనే ఉద్దేశ్యం తో అల్లూ అరవింద్ ఈ ప్లాన్ వేస్తున్నారట.

Similar News