ఇప్పుడు సైలెంట్ అయ్యారేమిటి..?

మెగా ఫ్యామిలీ ముచ్చట్లు అభిమానులతో పంచుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండే ఉపాసన ప్రస్తుతం సైలెంట్ గా కనబడుతుంది. రామ్ చరణ్ ని పెళ్లాడిన తర్వాత ఉపాసన.. రామ్ [more]

Update: 2019-02-01 08:06 GMT

మెగా ఫ్యామిలీ ముచ్చట్లు అభిమానులతో పంచుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండే ఉపాసన ప్రస్తుతం సైలెంట్ గా కనబడుతుంది. రామ్ చరణ్ ని పెళ్లాడిన తర్వాత ఉపాసన.. రామ్ చరణ్ కబుర్ల దగ్గర నుండి ఫ్యామిలిలో ఏ చిన్న అకేషన్ జరిగినా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందజేస్తుంది. అలాగే మహేష్ వైఫ్, నారా బ్రాహ్మణి, ఎన్టీఆర్ ఫ్యామిలీతో రామ్ చరణ్ కి ఉన్న సాన్నిహిత్యం కూడా ఉపాసనా ద్వారానే బయటికొచ్చింది. ఇక మిస్టర్ సి అలా.. మిస్టర్ సి ఇలా అంటూ సోషల్ మీడియాలో ఉపాసన పోస్ట్ లు పెడుతుండేది. రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండడు. అందుకే ఉపాసన ఎంత పెద్ద హోదాలో ఉన్నా చరణ్ విషయాలను అభిమానులకు కనెక్ట్ చేస్తూ ఉండేది.

వినయ విధేయ రామ ఎఫెక్ట్..?

అయితే రామ్ చరణ్ రంగస్థలం సినిమా అప్పటి నుండి రామ్ చరణ్ విషయాలను ఉపాసన ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంచేది. అతను జిమ్ లో ఉన్నా, వంట చేసినా, ఏ డైట్ ఫాలో అవుతున్నాడు, చరణ్ బాడీ షేప్ ఇలా ఏ విషయాన్ని అయినా ఉపాసన సోషల్ మీడియా వేదికగా హైలెట్ చేసేది. అందుకే రామ్ చరణ్ కి ఉపాసన గోస్ట్ పీఆర్వో అంటూ మీడియా మిత్రులు కామెంట్స్ కూడా చేశారు. మరి ఎప్పుడూ చరణ్ విషయంలో యాక్టీవ్ గా ఉండే ఉపాసన ప్రస్తుతం చరణ్ విషయాలను బయటపెట్టడం లేదు. చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ఫలితం చూసాక ఉపాసన, రామ్ చరణ్ సైలెంట్ అయ్యారు. చరణ్ ముచ్చట్లు వదిలేసి ఉపాసన తన పని తాను చూసుకుంటున్నారు. ఇది వినయ విధేయ రామ ఎఫెక్ట్ అనుకోవాలేమో. మరి రామ్ చరణ్ తాజా చిత్రం RRR ముచ్చట్లతో ఉపాసన మళ్లీ ఎప్పుడు తెర మీదకి వస్తుందా అని మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.

Tags:    

Similar News