తృటిలో తప్పించుకున్న పూజ..?

మేడే రోజున హైదరాబాద్ లో మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ అతిరథమహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. మహేష్ బాబు, వెంకటేష్, విజయ్ దేవరకొండ పాల్గొన్న ఈ [more]

Update: 2019-05-03 06:33 GMT

మేడే రోజున హైదరాబాద్ లో మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ అతిరథమహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. మహేష్ బాబు, వెంకటేష్, విజయ్ దేవరకొండ పాల్గొన్న ఈ వేడుకకు మహర్షి హీరోయిన్ పూజ హెగ్డే కూడా హాజరైంది. అందరి కళ్లు తన మీదే ఉండేలా డ్రెస్ వేసుకుని క్యూట్ లుక్స్ తో పూజ అదరగొట్టేసింది. డిజైనర్ డ్రెస్ లో పూజ హెగ్డే అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్నిటిలోనూ అంటే ప్రభాస్, అల్లు అర్జున్ మూవీస్ లో పూజనే హీరోయిన్ కాబట్టి ఇప్పుడు అవదరి చూపూ ఆమెపైనే ఉంది. ఇకపోతే మహర్షి ఈవెంట్ లో అందంగా మెరిసిన ఈ భామ డ్రంక్ అండ్ డ్రైవ్ లో తృటిలో తప్పించుకున్నట్లుగా కాస్త లేట్ గా ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

పోలీసులకు దొరికిన పూజ కారు

ఇంతకీ విషయం ఏమిటంటే మహర్షి ఈవెంట్ ముగిశాక గెస్ట్ లు, మహర్షి హీరో, డైరెక్టర్ అందరూ కామ్ గా కారెక్కి ఇంటికి వెళ్లిపోగా పూజ హెగ్డే మాత్రం తన మేనేజర్ తో కలిసి దగ్గర్లోని ఒక స్టార్ హోటల్‌ కు వెళ్లి బార్ లో సిట్టింగ్ వేసిందట. దాదాపు అర్థరాత్రయ్యాక.. రిటర్న్ జర్నీ కోసం రోడ్డెక్కిందని, రోడ్ మీదకొచ్చిన పూజ కారు దగ్గర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీస్ లకు చిక్కిందని.. కానీ డ్రైవింగ్ సీట్లో పూజ మేనేజర్ ఉండడంతో ఆమె తృటిలో తప్పించుకుందని వార్తలొస్తున్నాయి. ఇక తన మేనేజర్ ని, కారుని పోలీస్ లకు అప్పజెప్పి తన టీంతో కలిసి మరో కారులో అక్కడి నుండి వెళ్లిపోయిందట. అయితే అక్కడ మీడియా లేకపోవడంతో పూజ వ్యవహారం మీడియాకి చిక్కలేదు. లేదంటే మీడియాలో పూజని ఆడుకునేవారని అంటున్నారు.

Tags:    

Similar News