పడి పడి వాయిదా పడుతుందా..?

Update: 2018-09-27 06:17 GMT

శర్వానంద్ మహానుభావుడు సినిమా హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో సాయి పల్లవితో కలిసి ‘పడి పడి లేచే మనసు’ సినిమా చేస్తున్నాడు. అయితే సినిమా మొదలు పెట్టి చాలాకాలం అయ్యింది. ఇక ఈ సినిమాని నిర్మాతలు డిసెంబర్ 21న విడుదల చేస్తున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా ఫుట్ బాల్ ఆటగాడిగా నటిస్తుండగా సాయి పల్లవి వైద్యురాలి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ తో పాటుగా... మధ్యమధ్యలో చిత్ర బృందం వదిలిన స్టిల్స్ ఆకట్టుకున్నాయి. మహానుబావుడు హిట్ తో ఉన్న శర్వా, వరస హిట్స్ తో ఉన్న సాయి పల్లవిల కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ ఉన్నాయి.

షూటింగ్ పూర్తయినా...

ప్రస్తుతం చివరి షెడ్యూల్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే పూర్తి కావొస్తుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ.. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఈ రెండు నెలలు కేటాయించి మంచి ప్రమోషన్స్ తో హను రఘవపుడి పడి పడి లేచే మనసును అనుకున్న టైంకి విడుదల చేస్తాడని అనుకుంటున్నారు. అయితే మధ్యలో సాయి పల్లవి మీద కొన్ని రూమర్స్ రావడం, సాయి పల్లవి మీద శర్వా అలిగి షూటింగ్ కి కొన్ని రోజులు ఎగ్గొట్టాడని.. ఇలా ఏవేవో రూమర్స్ ప్రచారం లోకి వచ్చాయి.

గతేడాది హిట్ కొట్టినా...

ప్రస్తుతం సాయి పల్లవి మీద ఎటువంటి రూమర్స్ గానీ, ఆమె గురించిన లేటెస్ట్ సినిమా అప్ సెట్స్ గానీ బయటికి రావడం లేదు. ఇక శర్వా కూడా బయట ఎక్కడా ఫోకస్ అవ్వడం లేదు. మరోపక్క శర్వా.. సుధీర్ వర్మల సినిమా ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు. అయితే పడి పడి లేచే మనసు అనుకున్న సమయానికి విడుదలకావడం లేదట. మరి ముందుగా డిసెంబర్ 21న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ... ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు వున్నాయట. అయితే ఆ సినిమా వాయిదా ఎందుకు పడుతుందో అనే కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరి గత ఏడాది ఇదే టైంలో అంటే దసరా కి శర్వానంద్ జై లవ కుశ, స్పైడర్ చిత్రాలతో పోటీ పడి మహానుభావుడు తో హిట్ కొట్టాడు. కానీ ఈ ఏడాది మాత్రం చడీ చప్పుడు లేకుండా ఉన్నాడు.

Similar News