మహేష్ బాబు మహర్షి స్టోరీ ఇదేనట..!

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా లేట్ [more]

Update: 2019-02-26 09:32 GMT

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఇంకా లేట్ అవుతుండటంతో వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. అయితే గత కొన్ని నెలలు నుండి ఈ సినిమా స్టోరీ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్ ఈ చిత్రం స్టోరీ ఇదేనని ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో మహేష్ బాబు అమెరికాలో ఒక ధనికుడైన ఎన్నారై పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ ఫ్రెండ్ పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. మహేష్ ఇండియాకు నరేష్ కారణంగా తిరిగి వస్తాడని, ఇక్కడ రైతు సమస్యలపై పోరాటం చేస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

ప్రేక్షకులు విజిల్స్ వేస్తారంట…

అయితే అసలు మ్యాటర్ అది కాదట. ఇందులో అల్లరి నరేష్ చచ్చిపోతాడట. తన ప్రాణ స్నేహితుడి మరణం మహేష్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని..అందుకే మహేష్ ఇండియాకి వచ్చి ఇక్కడ రైతు సమస్యులు తీర్చి సమాజంలో కొత్త మార్పు తీసుకొనివస్తాడు అని అంటున్నారు. ఇక అల్లరి నరేష్ మరణం ఎపిసోడ్ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తుందని టాక్. సెకండ్ హాఫ్ మొత్తం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని… కొన్ని సీన్స్ కి ప్రేక్షకులు విజిల్స్ కూడా వెస్తారని ఇన్సైడ్ టాక్. మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News