ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

Update: 2018-10-16 10:05 GMT

'బాహుబలి' లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో 'సాహూ' చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ తప్ప ఇంకా ఏమి రిలీజ్ చేయకపోయినా లీక్ అయిన స్టిల్స్ నుంచే అభిమానులు సంతృప్తి చెందుతున్నారు. సినిమాలో కీలకం అయిన దుబాయ్ ఎపిసోడ్ ను ఆల్రెడీ షూట్ చేసేసారు. ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో ఓ 20 నిమిషాల పాటు గ్రామీణ నేపధ్యంలో సాగే ఎపిసోడ్ ఉంది అంట. ఇది కథలో కీలకంగా ఉండటమే కాక ప్రేక్షకులు ఊహించని మలుపుతో కొత్త థ్రిల్ ఇస్తుందట. రీసెంట్ గా దుబాయ్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ లో పల్లెటూరు వాతావరణంలో ప్రభాస్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నాడు సుజీత్. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ పల్లెటూరు సెట్ లో షూట్ చేయడం ఏంటని డౌట్ రావొచ్చు.

ఊహించని ట్విస్ట్ లతో...

సుజీత్ తీసే ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా ట్విస్టులతో సాగుతుందని చెబుతున్నారు. కెన్నీ బేట్స్ నేతృత్యంలో ఒళ్లు జలదరించే సీక్వెన్స్ ప్రభాస్ పై షూట్ చేస్తున్నారని.. ఇవి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ అని చెబుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. దానికి తోడు ప్రొమోషన్స్ కూడా చేయట్లేదు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు కానీ అప్పుడు రెండు పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యి ఉన్నాయి. మహేష్ 'మహర్షి' ఒకటి కాగా చిరంజీవి 'సైరా' మరొకటి. వాటితో క్లాష్ రాకుండా 'సాహో'ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఈ చిత్రం బడ్జెట్ కూడా 200 కోట్లు పైనే అంటున్నారు. అందుకే ఈ సినిమాను తెలుగు, హిందీలలో రిలీజ్ చేస్తున్నారు.

Similar News