ఎఫ్ 3 కూడా వస్తోంది… స్టోరీ ఇదే..?

ఎఫ్ 2 భారీ సక్సెస్ అవ్వడంతో త్వరలోనే ఎఫ్ 3ని కూడా స్టార్ట్ చేస్తాం అని మేకర్స్ స్టేజ్ మీద ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ [more]

Update: 2019-01-21 06:23 GMT

ఎఫ్ 2 భారీ సక్సెస్ అవ్వడంతో త్వరలోనే ఎఫ్ 3ని కూడా స్టార్ట్ చేస్తాం అని మేకర్స్ స్టేజ్ మీద ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ 3 కూడా ఎఫ్ 2 మాదిరే కామెడీతో ఉంటుందని అర్ధం అవుతుంది. మరి ఈ సినిమా కథ ఏమై ఉంటుందని చర్చ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ మీడియాకు సంబంధించిన వ్యక్తి తన అకౌంట్ లో పోస్ట్ చేసిన స్టోరీ ప్రస్తుతం అన్ని చోట్ల హల్చల్ చేస్తుంది. హైదరాబాద్ లో ఉంటున్న వెంకీ, వరుణ్ జంటలు హాయిగా కాలాన్ని గడుపుతున్న టైంలో వెంకీ – తమన్నా జంటకి కవల పిల్లలు పుడతారు. వరుణ్ – హనీ కూడా అదే ఇంట్లో ఉంటారు. వారి పిల్లల వల్ల వరుణ్ – హనీలకు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. ఐదేళ్ల వరకు పిల్లలు వద్దు అనుకున్న వీరికి వెంకీ పిల్లలు నరకం చూపిస్తుంటారు. ఈ గోల భరించలేక వరుణ్, హనీ దుబాయ్ లో రెస్టారెంట్ ఓపెనింగ్ అనే సాకుతో అక్కడికి వెళ్లిపోతారు.

ఇంట్రెస్టింగ్ ఉన్న స్టోరీ…

వీళ్లు దుబాయి వెళ్లిన తరువాత ఇక్కడ అన్నపూర్ణమ్మ మరణిస్తుంది. చనిపోయే ముందు వీలునామాలో డెబ్భై కోట్లు విలువ చేసే తన యాభై ఎకరాల పొలాన్ని హారిక, హనీల పిల్లలకు సమానంగా రాసిపోతుంది. అది కూడా ఒక కండిషన్ తో. ఇద్దరిలో ఎవరికి పిల్లలు లేకపోయినా మొత్తం ఆస్తి పిల్లలు ఉన్న వాళ్లకే వెళ్తుందని మెలిక పెడుతుంది. దీంతో వరుణ్ పిల్లలు కోసం ట్రై చేద్దాం అంటే అందుకు హనీ ఒప్పుకోదు. చేసేది ఏమీ లేక దుబాయ్ నుండి వస్తూ వస్తూ అక్కడ వరుణ్ ఫ్రెండ్ వాళ్ల అబ్బాయిని తీసికొచ్చి మా అబ్బాయే అని చెప్పుకుంటారు. మా పిల్లలు గొప్పంటే మా పిల్లలు గొప్పంటూ పోటాపోటీగా హెచ్చులకు పోవడం మొదలుపెడతారు. ఈలోపు వరుణ్ దుబాయ్ ఫ్రెండ్ ఇండియాకు వచ్చి డబ్బు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇంట్లోనే తిష్ట వేస్తాడు. సరిగ్గా వీలునామా చెల్లుబాటు అయ్యే రోజున వెంకీ కవల పిల్లలకు సంబంధించి ఒక ట్విస్ట్ బయట పడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి అనేది సినిమాలో చూడాలని అతను చెప్పాడు. వినటానికి చూడటానికి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి.

Tags:    

Similar News