రిలీజ్ డేట్ కూడా వచ్చాక ఇదేమిటి..?

నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కథ ముగిశాక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తాను సినిమాల్లోకి తెచ్చిన కాజల్ అగర్వాల్ తో సీత అనే [more]

Update: 2019-03-12 06:47 GMT

నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కథ ముగిశాక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తాను సినిమాల్లోకి తెచ్చిన కాజల్ అగర్వాల్ తో సీత అనే సినిమా చేస్తున్నాడు డేరెక్టర్ తేజ. షూటింగ్ చివరి దశలో ఉన్న సీత సినిమా ఏప్రిల్ 25న విడుదల డేట్ ఫిక్స్ కూడా చేసుకుంది. మరి విడుదల డేట్ ఫిక్స్ అయ్యాక ఇప్పుడు ఈ సీత సినిమా విషయంలో ఒక న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అదేమిటంటే సీత సినిమా సెట్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ కి, దర్శకుడు తేజకి చిన్నపాటి మనస్పర్థలు రావడంతో… తేజ సీత సెట్స్ నుండి అలిగి వెళ్లిపోయాడనే టాక్ వినబడుతుంది.

గెడ్డం తెచ్చిన గొడవ

అయితే తేజకి, బెల్లంకొండ శ్రీనివాస్ కి మధ్యన వచ్చిన విభేదాలకు కారణం గెడ్డం అంట. బెల్లంకొండని సీత సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల కోసం గెడ్డం పెంచమని తేజ కోరగా.. దానికి శ్రీనివాస్ నిరారించడంతో.. తేజ శ్రీనివాస్ మీద అలిగి సెట్స్ నుండి వెళ్లిపోయాడని చెబుతున్నారు. మరి షూటింగ్ చివరిలో ఉండగా.. ఇలాంటి విభేదాల వలన సినిమా విడుదలకు సమస్యలు వస్తాయనుకుంటే.. అదేమీ లేదు.. తేజ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేస్తానని సీత యూనిట్ కి మాటిచ్చినట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News