బోయపాటి విషయంలో మైత్రి వారు సేఫ్..!

ఒక ఫ్లాప్ వస్తే జీవితం ఎలా మారిపోతుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయి, బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి అంటే బహుశా ఇదేనేమో. ఒకప్పుడు సూపర్ హిట్ [more]

Update: 2019-02-27 08:27 GMT

ఒక ఫ్లాప్ వస్తే జీవితం ఎలా మారిపోతుందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయి, బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి అంటే బహుశా ఇదేనేమో. ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలు అందించిన బోయపాటి.. రామ్ చరణ్ తో తీసిన ‘విన‌య విధేయ రామ‌’ డిజాస్టర్ అవ్వడంతో ఆయన ఫేట్ మొత్తం మారిపోయింది. ఈ సినిమా నిర్మాతలు – బోయపాటికి మధ్య వివాదాలు చెలరేగాయి. ఇప్పుడు బోయపాటితో సినిమా చేద్దాం అని డిసైడ్ అయిన కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్ లు వెనక్కి ఇవ్వాలని కూర్చున్నారు. వివరాల్లోకి వెళ్తే… బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి బాలయ్యే నిర్మాత. ‘విన‌య విధేయ రామ‌’ ఫ్లాప్ అవ్వడంతో బోయపాటి రెమ్యూనరేషన్ లో కోత పడింది.

అడ్వాన్స్ వెనక్కు…

మరోవైపు బోయపాటి మైత్రీ మూవీస్‌తో ఓ సినిమా చేయ‌డానికి బోయ‌పాటి ఇదివ‌ర‌కే అడ్వాన్సు తీసుకున్నాడు. స‌రైనోడు స‌మ‌యంలోనే మైత్రీ అడ్వాన్సు ఇచ్చింది. అయితే ఇంతవరకు ఈ బ్యానర్ లో సినిమా సెట్ అవ్వలేదు. బోయపాటి ఎప్పుడు చేద్దాం అన్నా వారికి ఓకేనే. అయితే ‘విన‌య విధేయ రామ‌’ ఫ్లాప్ అవ్వడంతో వారు కొంచం జాగ్రత్త పడ్డారు. డైరెక్ట్ గా అడ్వాన్స్ అడగకుండా ‘మా సినిమా ఎప్పుడు చేస్తావ్’ అని అడుగుతున్నారట. విషయం అర్థం చేసుకున్న బోయపాటి ఆ అడ్వాన్సుని వెన‌క్కి తిరిగి ఇచ్చేసి, ఎగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఇక బోయపాటి చేతిలో గీత ఆర్ట్స్ అడ్వాన్స్ కూడా ఉంది. మరి దీని మాటేమిటో చూడాలి.

Tags:    

Similar News