బోయపాటిని ఇబ్బంది పెడుతున్నారే..!

బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఈయన గురించే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. వినయ విధేయ రామ చిత్రం ఫ్లాప్ అవ్వడమే ఈయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. [more]

Update: 2019-03-01 09:42 GMT

బోయపాటి శ్రీను. ప్రస్తుతం ఈయన గురించే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. వినయ విధేయ రామ చిత్రం ఫ్లాప్ అవ్వడమే ఈయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో హీరో రామ్ చరణ్, నిర్మాతలు రెమ్యూనరేషన్ నుండి ఒక 5 కోట్లు వెనక్కు ఇవ్వవలసిందిగా బోయపాటిని కోరారు. దానికి బోయపాటి ఒప్పుకోలేదు. కానీ చివరికి ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఆయనను ఒప్పించి కొంత అమౌంట్ వరకు రాబట్టారు అని చెబుతున్నారు. ఆ మధ్య సరైనోడు సినిమా హిట్ అయ్యినప్పుడు బోయపాటికి మైత్రి మూవీ వారు కోటి అడ్వాన్స్ ఇచ్చి తమ బ్యానర్ లో సినిమా చేయాలని చెప్పారు.

వెనక్కు ఇవ్వాలంటున్న ప్రొడ్యూసర్స్

ఇక రీసెంట్ గా వినయ విధేయ రామ ఫ్లాప్ అవ్వడంతో ఆ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలని కోరారు మైత్రి ప్రొడ్యూసర్స్. చేసేది ఏమీ లేక బోయపాటి ఆ అమౌంట్ తిరిగి ఇచ్చేసాడని అన్నారు. కానీ బోయపాటి ఇంకా అడ్వాన్స్ వెనక్కు ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై డిస్కషన్లు నడుస్తున్నాయి. బోయపాటి కోటికి తక్కువగానే అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీనికి వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీలు లెక్క కట్టి, ఆరేడు కోట్లు వెనక్కు ఇవ్వమని మైత్రీ మూవీస్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు.

Tags:    

Similar News