బాలకృష్ణ నిర్ణయం మంచిదే..!

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుని లాస్ వెంచర్ లోకి వెళ్లింది. ఎన్టీఆర్ జీవితకథ కాబట్టి మొదటి నుండే ఈ [more]

Update: 2019-01-18 07:10 GMT

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుని లాస్ వెంచర్ లోకి వెళ్లింది. ఎన్టీఆర్ జీవితకథ కాబట్టి మొదటి నుండే ఈ సినిమాపై అంచనాలు ఉన్న మాట వాస్తవమే. కానీ బయ్యర్స్ ని లాస్ లోకి లాగేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఒక రేంజ్ లో చేసింది కానీ కలెక్షన్స్ కి వచ్చేప్పటికి ఈ సినిమా చేతులు ఎత్తేసింది. దీంతో బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం “మహానాయకుడు” సినిమాని బయ్యర్స్ కి ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట.

నష్టాలు పూడ్చేందుకు…

మరో 15 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న “మహానాయకుడు” వచ్చే నెల ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాను బాలకృష్ణ మొదటి భాగం కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కే ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. మొదటి భాగంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి రెండో భాగంతో అయిన కొంతవరకైనా బయటపడొచ్చని అనుకుంటున్నారట. ఇక రెండో భాగం మహానాయకుడు మొత్తం ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన గురించే ఉంటుంది.

Tags:    

Similar News