అరవింద్ ఇక తప్పుకుంటారంట..!

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించాడు. గ‌జిని, మ‌గ‌ధీర లాంటి బ్లాక్‌బ్ల‌స్ట‌ర్లు కూడా ఈ బ్యానర్ నుండే వచ్చాయి. [more]

Update: 2019-03-20 08:41 GMT

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించాడు. గ‌జిని, మ‌గ‌ధీర లాంటి బ్లాక్‌బ్ల‌స్ట‌ర్లు కూడా ఈ బ్యానర్ నుండే వచ్చాయి. ఒకరకంగా మెగా హీరోస్ అందరికీ ఇదే సొంత బ్యానర్. కథల ఎంపిక, నిర్మాణం త‌దిత‌ర విష‌యాల‌కు అల్లు అరవింద్ సిద్ధహ‌స్తుడ‌న్న పేరు తెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ కాకుండా చిన్న సినిమాలు నిర్మించడానికి జీఏ 2 పేరిట మ‌రో అనుబంధ సంస్థ‌ను ఏర్పాటు చేసాడు. అయితే మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం క్ర‌మంగా అర‌వింద్ నిర్మాణ బాధ్య‌త‌ల నుంచి ప‌క్కకు త‌ప్పుకోవాల‌ని భావిస్తన్నారట.

తనయులకు అప్పగించేసి…

ప్రస్తుతం ఆయన చేతిలో రెండు మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి పూర్తిగా అరవిందే చూసుకోనున్నాడు. టాలీవుడ్‌లోని కొంత‌మంది అగ్ర హీరోల‌తో సినిమాలు చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి రెండేళ్లు పట్టొచ్చు. అవి పూర్తి అవ్వగానే నిర్మాణ బాధ్య‌త‌ల్ని త‌న‌యులకు అప్ప‌గించాల‌ని భావిస్తున్నారు. అంటే అల్లు అర్జున్, శిరీష్ ఈ బాధ్యతలు టేకోవ‌ర్ చేసే అవ‌కాశాలున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News