అల్లరి నరేష్ కోటిన్నర అందుకున్నారా..?

మహేష్ బాబు – పూజ హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో జరుగుతుంది. ఈ [more]

Update: 2019-04-01 08:53 GMT

మహేష్ బాబు – పూజ హెగ్డే జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ హీరో కాగా అల్ల్లరి నరేష్ మహేష్ కి స్నేహితుడిగా, పేదింటి కుర్రాడిగా నటిస్తున్నాడు. కామెడీ హీరోగా సక్సెస్ లేని అల్లరి నరేష్ ఇలా మహర్షి మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మంచిదే. ఒకపక్క హీరోగా ఇలా ప్రాధాన్యమున్న పాత్రల్లో అల్లరి నరేష్ నటిస్తూ ఉంటే టాలీవుడ్ లో పదికాలాల పాటు ఉండవచ్చనే లాజిక్ ని అల్లరి తెలుసుకునే మహర్షిలో ఈ సైడ్ క్యారెక్టర్ చెయ్యడానికి మొగ్గు చూపాడని అన్నారు.

హీరోగా నటించిన సినిమాల కంటే ఎక్కువ

అయితే ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న ఈ కామెడీ హీరోకి మహర్షి ఆఫర్ రావడం, అది మహేష్ సినిమా కావడం, అలాగే కథలో తన పాత్ర కీలకం కావడంతోనే మహర్షి ఆఫర్ ని ఒప్పుకున్నాడట. మహేష్ ఫ్రెండ్ గా నటించినందుకు భారీ పారితోషకం కూడా మహర్షి సినిమాలో అల్లరి నరేష్ నటించడానికి ఒక కారణమంటున్నారు. ఇంతవరకు తాను హీరోగా చేసిన సినిమాలకు కూడా అందుకోని భారీ పారితోషకాన్ని అల్లరి నరేష్ మహర్షి కోసం అందుకున్నాడట. మహర్షిలోని రవి పాత్ర కోసం అల్లరి నరేష్ ఏకంగా కోటిన్నర పారితోషకాన్ని అందుకున్నాడట. అల్లరి కెరీర్ లోనే మహర్షి పారితోషకం హైయ్యెస్ట్ అంటున్నారు. ఒకవేళ మహర్షి సినిమాలో తన పాత్ర గొప్పగా పండితే ఇలాంటి మరిన్ని అవకాశాలు అందుకోవాలని నరేష్ భావిస్తున్నాడట.

Tags:    

Similar News