మజ్ను తర్వాత జాకీగా అఖిల్..?

Update: 2018-10-24 06:37 GMT

అఖిల్ డిజాస్టర్, హలో యావరేజ్ తర్వాత తొలిప్రేమ హిట్ తో ఉన్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాని చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ముందు అనుకున్న తేదీ ప్రకారం అయితే డిసెంబర్ 21నే విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలు, షూటింగ్ ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో... మిస్టర్ మజ్నుని ఫిబ్రవరి 14 న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. మిస్టర్ మజ్నులో లవర్ బాయ్ లుక్ లో నిధి అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్న అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టాడంటున్నారు.

ఆది పినిశెట్టి అన్నతో...

గతంలోనే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించిన వార్తలొచ్చాయి. అయితే మిస్టర్ మజ్ను హిట్ అయ్యాకే ఆ డైరెక్టర్ కి కమిట్ అవుతాడంటూ చెప్పారు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు. హీరో ఆది పినిశెట్టి అన్న సత్య పినిశెట్టి. సత్య పినిశెట్టి దర్శకుడిగా హలో సినిమా తర్వాత సినిమా ఉంటుందని వినిపించినప్పటికీ అఖిల్ తొలిప్రేమ దర్శకుడికే మొగ్గు చూపడంతో మిస్టర్ మజ్ను పట్టాలెక్కింది. అయితే తన తదుపరి చిత్రాన్ని మాత్రం అఖిల్ సత్య పినిశెట్టికి కమిట్ అయ్యాడని.. అందులోనూ సత్య కూడా అఖిల్ కి కథ డెవెలెప్ తో పాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టినట్లుగా తాజాగా వార్తలు వెలువడుతున్నాయి.

కథ కొత్తగా ఉండటంతోనే...

దర్శకుడు సత్య... అఖిల్ కి కథ వినిపించడం.. అఖిల్ ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. అయితే సత్య చెప్పిన కథ డిఫరెంట్ గా ఉండడం... అలాగే ఆ సినిమాలో అఖిల్ గుర్రపు స్వారీ చేసే జాకీగా కనిపించనున్నాడని చెబుతున్నారు. కథా కథనాల్లోని కొత్తదనం ఉన్న కారణంగానే సత్య డైరెక్షన్ లో సినిమాను చేసేందుకు అఖిల్ అంగీకరించాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరిని అనుకోలేదంటున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయంటున్నారు.

Similar News