మహేష్ ఫ్యామిలీతో అడివి శేష్..?

Update: 2018-09-18 07:08 GMT

బాహుబలిలో భల్లాలదేవుడి కొడుకుగా అడివి శేష్ నటించాడు. చేసింది చిన్న పాత్రే అయినా తనకి ఆ పాత్ర మంచి పేరు తీసుకొచ్చిది. ఇక క్షణం, గూఢచారి సినిమాలతో రైటర్ గా, హీరోగా అడివి శేష్ తనని తానూ ప్రూవ్ చేసుకున్నాడు. క్షణం, గూఢచారి సినిమాలు అడివి శేష్ ని నిలబెట్టాయి. ఆ సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యి నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చిపెట్టడంతో.. ఇప్పుడు అందరి చూపు ఈ అడివి శేష్ మీదే పడింది. అందుకే చాలామంది నిర్మాతలు అడివి శేష్ తో పని చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అడివి శేష్ 2 స్టేట్స్ రీమేక్ లో రాజశేఖర్ కూతురు శివాని తో కలిసి నటిస్తున్నాడు.

ఛాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ లో...

2 స్టేట్స్ రీమేక్ తప్ప మరే సినిమా అడివి శేష్ చేతిలో లేదు. క్షణం, గూఢచారి వంటి థ్రిల్లర్ సబ్జెట్ ఉన్న కథలతో పాటు ప్రేక్షకుడు దేనికి ఎక్కువ కనెక్ట్ అవుతాడో.. ఆయా కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తానంటున్నాడు ఈ యువ హీరో. అయితే బాలీవుడ్ సినిమాలకు కూడా కథలు అందించగలను అంటున్న అడివి శేష్ 2 స్టేట్స్ రీమేక్ తర్వాత మహేశ్ బాబు ఫ్యామిలీలో ఒకరు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించాడని టాక్. ఇక సోషల్ మీడియా సెన్సేషన్ అయిన ఛాయ్ బిస్కెట్ ఈ సినిమాతో సినిమా ప్రొడ‌క్ష‌న్‌లోకి ఎంటర్ అవుతుందని... ప్రస్తుతం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ టాక్.

డైరెక్టర్ ఎవరో..?

మరి ఈ బ్యానర్ లో రాబోతున్న అడివి శేష్ సినిమాకి ఇంకా డైరెక్టర్ ఎవరనేది కన్ఫర్మ్ కాలేదట. మరి అడివి శేష్ ఈసారి ఎలాంటి థ్రిల్లింగ్ సబ్జెక్టు తో రాబోతున్నాడో కానీ... అప్పుడే అడివి శేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అందరిలో క్యూరియాసిటీ మొదలైపోయింది. ఇకపోతే ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్, ఛాయ్ బిస్కెట్ సంయుక్తంగా నిర్మించే సినిమాలో అడివి శేష్ నటించడం కన్ఫర్మ్ అనేది మాత్రం మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన ద్వారా తెలియనుంది.

Similar News