మంత్రాలకు…చింతకాయలు…??

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ హీట్ ఢిల్లీ వరకు వెళ్ళింది. వంచనపై గర్జన పేరుతో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ లో భారీ దీక్ష చేపట్టి ప్రజలను ఆకట్టుకుంది వైసిపి. [more]

Update: 2018-12-28 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ హీట్ ఢిల్లీ వరకు వెళ్ళింది. వంచనపై గర్జన పేరుతో ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ లో భారీ దీక్ష చేపట్టి ప్రజలను ఆకట్టుకుంది వైసిపి. ఈ వేదిక టార్గెట్ బిజెపి సర్కార్ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలు చేసింది అనే అంశం ప్రధాన ఎజెండా. ఆ అజెండాను బ్యానర్ గా ఏర్పాటు చేసిన వైసిపి విరుచుకుపడింది మాత్రం టిడిపిపైన కావడం గమనార్హం. తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ వేదికపై నాయకులంతా. బిజెపి అన్యాయం చేయడానికి ప్రధాన కారణం చంద్రబాబు వారితో నాలుగేళ్ళు అంటకాగడమే అన్న అంశాన్ని ప్రజల్లో గట్టిగానే తీసుకువెళ్ళింది వైఎస్ ఆర్ పార్టీ .

ఢిల్లీ లో వైసిపి గల్లీలో టిడిపి …

ఏపీకి ప్రత్యేక హోదా లక్ష్యంగా వైసిపి హస్తిన కేంద్రంగా పోరాటం తీవ్రం చేసింది. ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతున్న నేపథ్యంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవడం విపక్ష పార్టీకి తప్పనిసరి అయ్యింది. దాంతో మోడీ బాబు లు దగా చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారనే ప్రచారం వేడి చల్లారకుండా కొనసాగించాలని వైసిపి డిసైడ్ అయిపోయింది. దాంతో వచ్చే మూడు నెలలు వివిధరకాల ఆందోళనలతో చంద్రబాబు చేస్తున్న ప్రచారం తిప్పికొట్టే పనిలో జగన్ టీం బిజీ అయ్యింది అన్నది స్పష్టం అవుతుంది.

ఆ మంత్రమే టీడీపీది….

మరోపక్క టిడిపి అభివృద్ధి మంత్రమే తమను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని భావించి వ్యూహాత్మక కార్యాచరణతో అడుగులు వేస్తుంది. అమరావతి సెక్రెటేరియట్ శంఖుస్థాపన, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ శంఖుస్థాపన వంటి కార్యక్రమాలతో తాము తిరిగి అధికారంలోకి రాకపోతే ఈ అభివృద్ధి అంతా నిలిచిపోతుందనే ప్రచారం చేసేందుకు అస్త్ర శస్త్రాలు సంధింస్తుంది. దాంతో రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే వ్యూహాలతో ఎపి రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అని తలపడుతూ ఉండటం విశేషం.

Tags:    

Similar News