అక్కడ అన్ని చోట్లా టీడీపీని వాష్ అవుట్ చేస్తారా…?

రాజకీయాల్లో దూకుడు గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అది వైఎస్సార్ తన పాలనలో రుచి చూపించారు. దానికి పది రెట్లు జగన్ ఇపుడు జోరు చేస్తున్నారు. జగన్ [more]

Update: 2021-03-08 02:00 GMT

రాజకీయాల్లో దూకుడు గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అది వైఎస్సార్ తన పాలనలో రుచి చూపించారు. దానికి పది రెట్లు జగన్ ఇపుడు జోరు చేస్తున్నారు. జగన్ మార్క్ పాలిటిక్స్ ని తట్టుకోవడం ఏపీలోని విపక్షాలకు సాధ్యం కావడంలేదు. ఇక చంద్రబాబుది డెబ్బైల నాటి రాజకీయం. అది ఎపుడో అవుట్ డేటెడ్ పాలిటిక్స్ అని తెలిసినా కూడా బాబు దాన్నే నమ్ముకున్నారు. కాలంతో పోటీ పడి ఆయన అప్ డేట్ కావడంలేదని సొంత పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారు.

చెప్పినవే చెప్పి …

జగన్ ఫ్రాక్షనిస్ట్ అని చాలా సార్లు రికార్డ్ అరగదీసిన చంద్రబాబు నేరగాడు అంటూ కొత్తగా విమర్శిస్తున్నారు. సరే ఎవరు ఏంటి అన్నది జనాలకు తెలిసే ఓటు చేశారు. బాబు అవును అన్నా కాదు అని చెప్పినా జగన్ సీఎం. ఈ విషయం ఒప్పుకుని తీరాల్సిందే. మరో వైపు చూసుకుంటే ఇప్పటికి రెండు ఎన్నికలు జరిగాయి. 2019లో జరిగిన సాధారాణ ఎన్నికల్లో వైసీపీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఢంకా భజాయించింది. అయినా బాబు తాను ఓడిపోవడం లేదు అని చెప్పడమే విడ్డూరం. దాంతో తమ్ముళ్ళనే ఆయన విసిగించేస్తున్నారట.

బాబు మాటలే ఆయుధాలుగా…?

ఇక బాబు ఇలా మాట్లాడుతూండగానే మునిసిపల్ ఎన్నికలు వచ్చేశాయి. విశాఖ అంటే వైసీపీకి ఎంతో మోజు ఉన్న సంగతి విదితమే. దాంతో విశాఖ మేయర్ తామే గెలుచుకోవాలని వైసీపీ చాలా పెద్ద ప్లాన్ తోనే ఉంది. చంద్రబాబు విశాఖ రాజధాని విషయంలో కూడా పాత మాటలనే వల్లిస్తున్నారు. ఆర్ధిక రాజధాని అంటూ పాత చింతకాయ కబుర్లే చెబుతున్నారు. అసలైన రాజధాని విశాఖకు వచ్చేస్తూంటే ఇంకా విశేషణాలతో కూడిన రాజధానులు ఎందుకు బాబూ అని తమ్ముళ్ళే అంటున్నారుట. బాబు మాటల్లోని డొల్లతనాన్ని తమకు అనువుగా మార్చుకుని విశాఖలో పాగా వేసేందుకు జగన్ భారీ ప్లాన్ తో రెడీ అవుతున్నారు.

మూడొంతులు టార్గెట్…..

విశాఖ కార్పొరేషన్ లో 98 వార్డులు ఉన్నాయి. ఇందులో వైసీపీ టార్గెట్ 75 వార్డులు. కచ్చితంగా ఈ సంఖ్య గెలుచుకోవాలని ఆ పార్టీకి అధినాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చేశాయి. దాని కోసం వైసీపీ ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అవుతోంది. ఇక టీడీపీ బడా నేతలను కూడా తమ వైపునకు లాగేయడానికి వైసీపీ స్కెచ్ తో సిధ్ధంగా ఉంది. ఎన్నాళ్ళ నుంచో ఆ పార్టీని నమ్ముకుని ఉన్న వారు సైతం జీవీఎంసీ ఎన్నికల వేళ వైసీపీలోకి క్యూ కడుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో ఏకగ్రీవాలకు శ్రీకారం చుడతామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొస్తున్నారంటే టీడీపీని వాష్ అవుట్ చేసే భారీ పధకమే దీని వెనక ఉందని అంటున్నారు.

Tags:    

Similar News