జగన్ టార్గెట్ కష్టమే.. తిరుపతిలో వైసీపీకి ఇక్కడే కాస్త డౌట్ ?

ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఏప్రిల్ నెల 17న జరగనుంది. ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు కూడా [more]

Update: 2021-04-07 14:30 GMT

ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఏప్రిల్ నెల 17న జరగనుంది. ఎన్నికల నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు కూడా ఖ‌రార‌య్యారు. టీడీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, వైసీపీ నుంచి జ‌గ‌న్ వ్యక్తిగ‌త డాక్టర్ గురుమూర్తి పోటీలో ఉండ‌నున్నారు. కాంగ్రెస్ సైతం పార్టీ సీనియ‌ర్ నేత డాక్టర్ చింతామోహ‌న్‌ను రంగంలోకి దింపింది. ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు ఎవ‌రిది ? అన్న విష‌యంలో ఎవ్వరికి పెద్ద సందేహాలే లేవు. అధికార పార్టీ ఎంత మెజార్టీతో ఈ సీటును గెలుచుకుంటుంది ? అన్నదే కాస్త ఆసక్తిగా మారింది.

ఈ రెండు నియోజకవర్గాల్లో…..

జ‌గ‌న్ ఇప్పటికే ప‌ది మందికి పైగా మంత్రుల‌ను ఇక్కడ మోహ‌రించారు. పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీకి వ‌చ్చి 2.28 ల‌క్షల మెజార్టీని దాటి 4 ల‌క్షలు రావాల‌న్నదే జ‌గ‌న్ పెట్టిన టార్గెట్‌. ఇక సెగ్మెంట్లలో తాము అంచ‌నా వేసుకున్న మెజార్టీ వ‌స్తుంద‌ని వైసీపీ వాళ్లు లెక్కలు వేసుకుంటున్నారు. తిరుప‌తి, స‌ర్వేప‌ల్లిలో మాత్రం త‌మ‌కు మ‌రీ అంత వ‌న్‌సైడ్ ప‌రిస్థితి లేద‌ని వైసీపీ చేయించిన స‌ర్వేలో తేలిన‌ట్టు స‌మాచారం. తిరుప‌తిలో గ‌త ఎన్నిక‌ల్లోనే వైసీపీ ఎమ్మెల్యే గెలిచినా పార్లమెంటుకు వ‌చ్చేస‌రికి ప‌న‌బాక ల‌క్ష్మికి 800 ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.

కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచినా…..

ఇటీవ‌ల తిరుపతి కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌న్‌సైడ్‌గా గెలిచినా… స్థానిక ప్రభావం ఇప్పుడు ఉండ‌ద‌ని చాలా డివిజ‌న్లలో టీడీపీ, జ‌న‌సేన పోటీలో లేక‌పోవ‌డంతో త‌ప్పనిస‌రిగా వైసీపీకి అంద‌రూ ఓట్లేశార‌ని.. ఈసారి ఆ ప‌రిస్థితి ఉండ‌ద‌ని చాలా మంది చెపుతున్నారు. వైసీపీకి కూడా తిరుప‌తి విష‌యంలో ఈ డౌట్ ఉంది. ఈ సారి ఇక్కడ కొన్ని సామాజిక వ‌ర్గాలు మ‌రీ వ‌న్‌సైడ్‌గా వైసీపీని నెత్తిన పెట్టుకునే ప‌రిస్థితి లేదు. ఇక తిరుప‌తి ఆధ్యాత్మిక న‌గ‌రం కావ‌డంతో ఈ సారి బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఇక్కడ ప్రధానంగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో పాటు స‌త్తా లేక‌పోయినా బీజేపీ ఇక్కడ ధ‌నం వెద‌జ‌ల్లి గౌర‌వ‌ప్రద ఓట్ల కోసం ప్లాన్ చేస్తోంది. దీంతో ఈ సెగ్మెంట్ వ‌ర‌కు అయినా వైసీపీకి గ‌ట్టి పోటీ త‌ప్పేలా లేదు. ఆ పార్టీకి మెజార్టీ వ‌చ్చినా అనుకున్న స్థాయిలో వ‌స్తుందా? రాదా? అన్నదే డౌట్ ?

సర్వేపల్లిలోనూ…..

ఇక ఈ సెగ్మెంట్ ప‌రిధిలోని స‌ర్వేప‌ల్లిలో సోమిరెడ్డి ఓడిపోతున్నా మెజార్టీ ఎప్పుడూ ఐదారు వేల‌కు మించ‌డం లేదు. గ‌ట్టి పోటీ మ‌ధ్యే ఆయ‌న ఓడిపోతున్నారు. ఈ సారి ఆయ‌న‌కు అక్కడ సానుభూతి ప‌నిచేసేలా ఉంది. ఇక్కడ కూడా ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థన్ రెడ్డి గ‌ట్టిగా క‌ష్టప‌డుతున్నారు. ఆయ‌న‌కు మెజార్టీ వ‌చ్చినా వైసీపీ అనుకున్న 3 ల‌క్షల మెజార్టీ రావాలంటే ఇక్కడ 50 వేలు రావాలి.. కానీ ఆ ప‌రిస్థితి లేదు. ఏదేమైనా తిరుప‌తిలో వైసీపీ ల‌క్ష్యానికి తిరుప‌తి, స‌ర్వేప‌ల్లి సెగ్మెంట్లు ఖ‌చ్చితంగా దెబ్బకొట్టేలా ఉన్నాయి. మ‌రి ఇక్కడ టీడీపీ ఎంత ట‌ఫ్ ఫైట్ ఇస్తుందో ? చూడాలి.

Tags:    

Similar News