జగన్ మరో సర్వే… ఈసారి అలా కాదు

ఇంగ్లీష్ మీడియం అమలుపై మరోసారి సర్వే చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ సంస్థతో థర్డ్ పార్టీ సర్వే చేయించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. విద్యా రంగంలో [more]

Update: 2020-05-22 09:30 GMT

ఇంగ్లీష్ మీడియం అమలుపై మరోసారి సర్వే చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ సంస్థతో థర్డ్ పార్టీ సర్వే చేయించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించేందుకు ఒక జాతీయ ఛానల్ కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే దీనిపై సర్వే ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గలు వెల్లడించాయి. ఇప్పటికే ఒకసారి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంపై సర్వే చేసింది.

జాతీయ ఛానెల్ ద్వారా……

సమగ్ర శిక్షణా అభియాన్ కింద షార్ట్ ఫిల్మ్‌లతో పాటు సర్వే చేయించాలని నిర్ణయించింది. అలాగే ఈ సర్వేను చేపట్టేందుకు ఓ నేషనల్ ఛానల్‌ ముందుకు వచ్చినట్లు సమాచారం.గతంలోనే ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రభుత్వం సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు. ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని లిఖితపూర్వకంగా అందజేశారు.

సుప్రీంకోర్టుకు అయినా…..

ఇంగ్లీష్ మీడియంలో బోధన విషయంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను కోరింది.రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రెండు జీవోలు తీసుకురాగా.. హైకోర్టు కొట్టివేసింది. ఏ మీడియంలో చదువుకోవాలనే ఆప్షన్‌ ను తల్లిదండ్రులు, విద్యార్థులే నిర్ణయించుకుంటారని తెలిపింది. అలాగే వారి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో ప్రభుత్వం పేరెంట్స్ నుంచి అభిప్రాయాలు సేకరించింది.. మళ్లీ ప్రభుత్వం సర్వే చేసేందుకు సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అయినా ప్రభుత్వం వెనకాడదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News